CM KCR : సీఎం కేసీఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఢిల్లీలో భారీ బహిరంగ సభ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు
- By hashtagu Published Date - 04:48 PM, Sun - 2 October 22
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించి.. అదే రోజున కొత్త జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు సీఎం.
అయితే.. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కీలక భేటీ జరుగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే.. డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. తెలంగాణ భవన్ లో దసరా రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లు, జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్ లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతూనే ఉంది. సమావేశం అనంతరం దీనిపై పూర్తి సమాచారం తెలిసేలా ఉంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Related News
Lok Sabha Poll : తెలంగాణ లో పోలింగ్ సమయం పొడిగింపు
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది