HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Speech At Munugodu Sabha

CM KCR : రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్రం కుట్ర.!!

దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

  • Author : hashtagu Date : 20-08-2022 - 5:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM kcr and telangana
CM KCR Telangana

దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ఆయన మునుగోడు సభలో ప్రసంగించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలన్న ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులు, పేదలకు పలు పథకాల కింద డబ్బులు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ఒకరు తమతో అన్నట్లు వెల్లడించారు కేసీఆర్.

ప్రజలంతా ఒక్క విషయాన్ని బాగా గమనించాలి .కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 8ఏళ్లు అయ్యింది. ఒక్క మంచి అయినా జరిగిందా…ఎవరికి జరిగింది. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు ఎవరికి మేలు జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఒక్కటైనా మంచి పని జరగలేదు. మరి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పైగా ఎయిర్ పోర్టులు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, రోడ్లు…ఇలా అన్నింటినీ అమ్మేయడం మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.

ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటలపై పడుతోంది కేంద్రం. రైతులకు, రైతు కూలీలకు నోట్లు మట్టి కొట్ట ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. నేను చచ్చినా వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టబోనని తేల్చి చెప్పారుకేసీఆర్. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటే ధర పెంచాలి, పండిన పంటలు కొనరు. రైతులు ఇక తాము వ్యవసాయం చేయలేమని చాలించుకునే పరిస్థితిని కలిపిస్తున్నారు. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ విధానం అంటూ మండిపడ్డారు. కార్పొరేట్ వ్యవసాయం పెడదాం మీరు మా వద్ద కూలీలుగా పనిచేయండి ఇదే వారి కుట్ర దీన్ని అంతా గమనించాలని సీఎం సూచించారు.

కేంద్రం రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనాలని అంటే మేం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాం. అయినా వడ్లు మేం కొనం అన్నారు. మేము గట్టిగా అడిగితే మై క్యార్నా అన్నారు. మీడియా వాళ్లు లేని సమయం చూసి తలుపులు పెట్టి మాట్లాడారు. ఎందుకు మీరు డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నారని మమ్మల్ని అడిగారు. రైతులుకు డబ్బులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 2వేల రూపాయల పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. పేదలకు పెన్షన్లు ఇవ్వద్దా…ఎవరి ఇవ్వాలో చెప్పండి మరి. పేదలకు కొట్టి తీసుకెళ్లి పెద్ద కార్పొరేటర్లకు ఇవ్వాలా…ఇప్పుడు దేశంలో జరుగుతోంది ఇదే అంటూ ఆరోపించారు కేసీఆర్.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • bjp
  • byelection
  • kcr
  • Munugode
  • munugodu
  • trs

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd