కార్మికుల సంక్షేమం కాంగ్రెస్తోనే – సీఎల్పీ నేత భట్టి
అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం గాంధీభవన్లో జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి
- By Prasad Published Date - 10:04 PM, Sun - 23 July 23
అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం గాంధీభవన్లో జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్కుమార్ యాదవ్, కేకేసి రాష్ట్ర చైర్మన్ సమీర్లు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం సమ్మెలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ బోర్డుపై సమీక్ష చేయడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. 2023-24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు.
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�