Telangana: చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు.
- By hashtagu Published Date - 12:32 PM, Mon - 20 December 21
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు. కోర్టుల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండడానికి కారణం న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడం మాత్రమే కాదని అన్నారు. ఆదివారం వరంగల్లో కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ఆన్లైన్లో ప్రారంభించారు. అనంతరం న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ఏయే రాష్ట్రాలు, ఏయే జిల్లాల్లో కోర్టు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయో, ఆధునికీకరించాల్సిన కోర్టు భవనాలేవో తెలుపుతూ సమగ్ర నివేదికను రూపొందించామని తెలిపారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా ఇండియన్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ న్యాయశాఖ మంత్రికి జూలైలోనే నివేదికను పంపించామని పేర్కొన్నారు. కానీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనైనా చట్టం రూపంలో తీసుకువస్తారని ఆశతో ఎదురుచూస్తున్నానన్నారు.
చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు భావిభారత నాయకులుగా ఎదగాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎల్లవేళలా ప్రశ్నించే తత్వాన్ని వదులుకోవద్దని, ప్రశ్నించడం ఆపొద్దని సూచించారు. అన్యాయాన్ని ఎదిరించడంలో యువత ముందుండాలన్నారు. అవసరమైన వారికి న్యాయం అందించడంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ ఉండదని ఎన్.వీ రమణ అన్నారు.
Related News
Warangal: బర్లను దొంగతనం చేసిన మహిళ.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు
Warangal: బర్లు ను దొంగతనం చేస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పరిధిలోని సర్వపురం 5వ వార్డులో వేముని స్వామికి చెందిన నాలుగు బర్ల ఇంటి ముందు కట్టేశారు. అయితే నర్సంపేట పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి �