Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!
- By Balu J Published Date - 01:04 PM, Wed - 27 December 23
Shocking: హైదరాబాద్లో గంజాయి పెట్టి మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె ఆరుగురు స్నేహితులను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయినందుకు ఆమె మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. హైదరాబాద్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి, న్యాయ విద్యార్థిని అదోక్షజ అలియాస్ రింకీ (26)కి శ్రవణ్కుమార్తో సంబంధం ఏర్పడింది. ఇటీవల అతను ఆమెను పలుకరించడం మానేశాడు. ఇది ఆమెకు కోపం తెప్పించింది. శ్రవణ్ను డ్రగ్స్ కేసులో తప్పుగా ఇరికించేందుకు తన స్నేహితుడు దీపక్ మోహన్ (30), టెక్కీ, యశ్వంత్ సాయి (21) అనే ప్రైవేట్ ఉద్యోగితో కలిసి పథకం వేసింది.
ఆమె, వారి కామన్ ఫ్రెండ్స్ తో కలిసి మంగళ్హాట్ ప్రాంతంలోని ఒకరి నుంచి 40 గ్రాముల గంజాయి పొడిని రూ.4,000కు కొనుగోలు చేసింది. వారి పథకం ప్రకారం శ్రవణ్ని అమీర్పేట సమీపంలోని పార్కుకు పిలిపించింది. అనంతరం ఆమె తన స్నేహితులతో కలిసి శ్రవణ్తో కలిసి బంజారాహిల్స్లోని ఓ పబ్కు వెళ్లింది. వారంతా పబ్లో ఉన్నప్పుడు, రింకీ తనకు తెలిసిన పోలీసు కానిస్టేబుల్కు ఫోన్ చేసి, శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని చెప్పింది.
కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని పోలీసులకు తెలిపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును తనిఖీ చేశారు. ఐదు ప్యాకెట్లలో ఎనిమిది గ్రాముల గంజాయిని గుర్తించారు. పోలీసులు శ్రవణ్ని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. మరికొందరితో కలిసి కారులో పబ్కు వచ్చారని, వారు దాచి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని పోలీసులు విచారించగా వారు ఒప్పుకున్నారు. రింకీతో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురు స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ టోపీ, సూర్యతేజ, మహేందర్ యాదవ్లను అరెస్టు చేశారు.
Also Read: Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Related News
Rajasingh : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ పై మరో పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. గత రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) పట్టణంలో రాజాసింగ్ బీజేపీ ఎంపీ అభ్య ర్థి నగేష్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని క