Cotton Candy: మేడారంలో అమ్ముతున్న పీచు మిఠాయిలో క్యాన్సర్ కారకాలు
ములుగు జిల్లా మేడారం జాతరలో విక్రయిస్తున్న కాటన్ మిఠాయి శాంపిల్ను తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల పరీక్షించగా క్యాన్సర్కు కారణమయ్యే రోడమైన్-బి అనే పదార్ధం ఉన్నట్టు తేలింది.
- Author : Praveen Aluthuru
Date : 21-02-2024 - 4:21 IST
Published By : Hashtagu Telugu Desk
Cotton Candy: ములుగు జిల్లా మేడారం జాతరలో విక్రయిస్తున్న పీచు మిఠాయి శాంపిల్ను తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల పరీక్షించగా క్యాన్సర్కు కారణమయ్యే రోడమైన్-బి అనే పదార్ధం ఉన్నట్టు తేలింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఆదివాసీ జాతర ప్రారంభమైంది. జాతరకు దేశం నలుమూలల నుండి ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ నుండి భక్తులు వస్తుంటారు. వేలాది మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నారు. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
తెలంగాణలో కాటన్ మిఠాయిని పీచు మిఠాయి అని పిలుస్తారు. అయితే ఈ మిఠాయిని తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రభుత్వాలు ఇటీవల నిషేదించారు. రోడమైన్-బి ప్రధానంగా వస్త్ర పరిశ్రమలు, ఇంక్లు మరియు వివిధ సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. రోడోమిన్-బి అనేది ఆహార రంగులో ఉపయోగించడానికి వీలు లేదు. రోడొమైన్-బి కలిపిన పీచు మిఠాయిని తినడం ద్వారా కడుపు నిండుగా ఉండటం, దురద మరియు శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి ప్రభావాలకు దారితీయవచ్చు. దీర్ఘకాలిక వినియోగం వల్ల మూత్రపిండాల పనితీరు బలహీనపడటం, కాలేయానికి కోలుకోలేని నష్టం, పేగులోని నాన్-హీలింగ్ అల్సర్లు క్యాన్సర్గా మారడం జరుగుతుంది.
Also Read: Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి