ByeByeModi: ‘సాలు మోదీ.. సంపకు మోదీ` పోస్టర్ల హల్ చల్
జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాదుకు వస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి నుంచే నిరసనలతో హోర్డింగ్ లు వెలుస్తున్నాయి.
- By CS Rao Published Date - 03:28 PM, Wed - 29 June 22
జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాదుకు వస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి నుంచే నిరసనలతో హోర్డింగ్ లు వెలుస్తున్నాయి. #ByeByeModi అనే హ్యాష్ట్యాగ్ తో ఉన్న ఒక హోర్డింగ్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ ప్రయత్నిస్తోన్న క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రైండ్ సమీపంలోని టివోలీ థియేటర్ వద్ద బైబై మోడీ అంటూ భారీ హోర్డింగ్ కనిపించడం రాజకీయ రణానికి దారితీస్తోంది. ఇటీవల మోడీ హైదరాబాద్ ఐఎస్ బీ స్నాతకోత్సవాలకు వచ్చిన సందర్భంగా కూడా ఇలాంటి హోర్డింగ్స్ ఆయన పర్యటించే ప్రాంతాల్లో కనిపించాయి. తాజాగా బైబై మోడీ అంటూ వారం ముందు నుంచే హోర్డింగ్ లు కనిపించడం సంచలనంగా మారింది.
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర క్యాబినెట్ నేతలు హాజరుకానున్నారు. ఆ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని టివోలీ థియేటర్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ పై #ByeByeModi అనే హ్యాష్ట్యాగ్ తో కనిపిస్తూ, రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్ పథకం, పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల (PSUలు) ప్రైవేటీకరణ మరియు COVID-19 మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావించబడింది. అందులో “ఇనఫ్ మోడీ” మరియు “ప్రజలను చంపవద్దు మోడీ” అని రాసి ఉంది. బేగంపేట పోలీసుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్మికులు జూన్ 29, బుధవారం హోర్డింగ్ను తొలగించారు.
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట ఈ హోర్డింగ్ను ఏర్పాటు చేశారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సూపర్వైజర్ మీడియాకు తెలిపారు. హోర్డింగ్పై ఉన్న టెక్స్ట్లో, “మీరు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు మరియు రైతులను చంపారు. నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలు తీసుకొచ్చి యువత బతుకులను దెబ్బతీశారన్నారు. ఆకస్మిక లాక్డౌన్తో పేదలను చంపారు. మీరు PSUలను విక్రయించారు, ఉద్యోగులను వీధుల్లోకి నెట్టారు. అందరి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇచ్చిన రూ.15 లక్షలు ఎక్కడివి? నోట్ల రద్దు ద్వారా మీరు సాధారణ పౌరుల వెన్ను విరిచారు. మోదీ ఇక చాలు. ప్రజలను చంపడం ఆపండి మోడీ. #ByeByeModi,” అని హోర్డింగ్ రాసి ఉంది.
ఫిబ్రవరిలో, ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ఆవిష్కరించడానికి ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు ముందు, టిఆర్ఎస్ మద్దతుదారులు #EqualityForTelangana అనే ట్రెండ్కు ట్విటర్లోకి తీసుకెళ్లారు. నిధులు, జాతీయ కేటాయింపుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విస్మరించిందని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన, తెలంగాణకు ఐటీఐఆర్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుపై అనేక ప్రశ్నలు వేస్తూ హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద టీఆర్ఎస్ మద్దతుదారుల బృందం బ్యానర్ అప్పట్లో కట్టింది. తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తోన్న మోడీకి ఇంకా నగర వ్యాప్తంగా ఇలాంటి హోర్డింగ్ ఎక్కడ వెలుస్తాయో చూడాలి.
ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో ఆదిపత్యం ప్రదర్శించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల్లోని బడా లీడర్లను ఆకర్షిస్తూ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంకేతం బలంగా తీసుకెళ్లడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి తరుణంలో సంచలన కలిగించేలా నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల వైఫల్యాలపై హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం సంచలనం కలిస్తోంది. మొత్తం మీద జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసే వరకు ఇలాంటి హోర్డింగ్ లు రాజకీయాన్ని మరింత రక్తికట్టించబోతున్నామని అర్థం అవుతోంది.
In #Hyderabad with the hashtag #ByeByeModi hoarding near Parade Ground, where Modi Ji will address the public meeting.
And mentioned "Enough Modi", Don't kill us with your farm laws and army jobs.#BJPNationalExecutiveMeeting pic.twitter.com/Uzkx8prEUk
— Politricks (@itsmeKNR) June 29, 2022
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.