HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Leaders Wants To Join In Congress Congress Graph Increasing In Telangana

Telangana Congress : కాంగ్రెస్‌లోకి క్యూ క‌డుతున్న బీఆర్ఎస్ నేత‌లు.. తెలంగాణ‌లో మారుతున్న పాలిటిక్స్

రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తారాస్థాయిలో కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వారిలో ఓ వ‌ర్గం కాంగ్రెస్‌లోకి వ‌చ్చేలా పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

  • Author : News Desk Date : 10-06-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS leaders wants to join in congress congress graph increasing in Telangana
BRS leaders wants to join in congress congress graph increasing in Telangana

తెలంగాణ‌(Telangana)లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్(Congress) ప‌ట్ల ఆద‌ర‌ణ రోజురోజుకు పెరుగుతోంది. క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల త‌రువాత ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ వైపు ఇత‌ర పార్టీల నేత‌లు క్యూ క‌డుతున్నారు. బీఆర్ఎస్(BRS) బ‌హిష్కృత నేత‌లు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), జూప‌ల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)లు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీజేపీ(BJP)లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, క‌ర్ణాట‌క ప‌లితాల త‌రువాత వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రికొద్ది రోజుల్లో భారీ బ‌హిరంగ స‌భ ద్వారా రాహుల్ లేదా ప్రియాంకా గాంధీ స‌మ‌క్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటార‌ని స‌మాచారం. వీరితో పాటు మ‌రికొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తారాస్థాయిలో కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వారిలో ఓ వ‌ర్గం కాంగ్రెస్‌లోకి వ‌చ్చేలా పార్టీ అధిష్టానం పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. శ‌నివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్ నేత మ‌ల్లు ర‌వితో ఆయ‌న నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక విష‌యంపై వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. వీరి భేటీ అనంత‌రం కూచ‌కుళ్ల దామోద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

క్యాడర్ నన్ను కాంగ్రెస్‌లో చేరాల‌ని ప్రేజర్ చేస్తోంద‌ని అన్నారు. అయితే, నాగ‌ర్‌క‌ర్నూల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డితో మాట్లాడిన త‌రువాత నా నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నాకు బీఆర్ఎస్ అధిష్టానంతో వ‌చ్చిన ఇబ్బందేమీలేదు.. కానీ, లోకల్ ఇబ్బందులే నాకు ఎక్కువగా ఉన్నాయ‌ని చెప్పారు. నాగంతో మాట్లాడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను అని దామోద‌ర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీల పరిస్థితి దారుణంగా ఉందని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అధికారాలే లేవని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రాష్ట్రంలోని ప‌లువురు నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

దామోద‌ర్ రెడ్డి లాంటి నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు ఉన్నార‌ని, వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌వారితో చ‌ర్చించి స్థానిక నేత‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా స‌యోధ్య కుదిర్చే ప్ర‌క్రియ‌ను కాంగ్రెస్ అధిష్టానం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత కాంగ్రెస్‌లోకి ఇత‌ర పార్టీల నేత‌లు క్యూ క‌డుతుండంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

 

Also Read : Telangana Congress: బీఆర్ఎస్‌కు షాక్.. మల్లు రవితో దామోదర్ రెడ్డి భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Jupalli Krishna Rao
  • ponguleti
  • revanth reddy
  • telangana

Related News

Ktr Sit

రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.

  • Bhatti Ap Congress

    మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి

  • Minister Uttam Kumar Reddy

    త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌కండి: మంత్రి ఉత్త‌మ్

  • Komatireddy Venkat Reddy

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి

  • Karnataka Assembly

    కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్

Latest News

  • సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

  • ఫామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 ప‌రుగులు!

  • న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!

  • ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?

  • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

Trending News

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

    • బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd