HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
- By Sudheer Published Date - 11:46 PM, Tue - 13 February 24
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ..అమరావతి ని రాజధానిగా కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆచరణలోకి తీసుకురాకుండా గడిపేశారు. మూడు రాజధానులు లేవు..ఒక రాజధాని లేదు..అసలు ఏపీకి రాజధానే లేకుండా జగన్ చేసాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశాన్ని బయటకు తీయడం తో అధికార నేతలు కొత్త పాట మొదలుపెట్టాడు. అదే హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచాలని వారంతా వాపోతున్నారు. ఇప్పటీకే పలువురు మంత్రులు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా ఉంచాలంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఏపి రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు. కేసిఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే…ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వారికి వంత పాడెలా ఉన్నదన్నారు. కేసిఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు…ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ,కేసిఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనే మేము కోరుకుంటున్నాం..మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి..కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు.
Read Also : Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..
Related News
AP : రౌడీ మూకలకు ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ వార్నింగ్..
ఎన్నికల వేళ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు