Big Company Invest : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన బడా కంపెనీ
మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో తన ఆర్ అండ్ డీ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది
- Author : Sudheer
Date : 13-06-2024 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంస్థలు బయటకు వెళ్తున్నాయని..ఆరు నెలల్లో ఒక్క సంస్థ కూడా రాలేదంటూ బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తుంది. తాజాగా మరో బడా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చింది. మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్లో తన ఆర్ అండ్ డీ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాలోని న్యూయార్కులో గురువారం కంపెనీ ఒలింపస్ కార్పొరేషన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్అండ్డీ) సయ్యద్ నవీద్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఒలింపస్ కార్పొరేషన్ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణకు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. కంపెనీకి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని, పెట్టబడులకు తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందని , స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని, అత్యాధునిక సాంకేతికతలతో పని చేయడానికి, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే వేదికను అందిస్తుందని తెలిపారు. ఈ సంస్థ మరిన్ని పెట్టుబడులు, సహకారాలను ప్రోత్సహిస్తుందన్నారు.
Read Also : BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు