BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు
- By Balu J Published Date - 09:55 PM, Thu - 13 June 24
![BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/11/MLA-Raghunandan-Rao.jpg)
BJP MP: గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని.. ఈ విషయం ఇంకా బయటికి రాలేందంటూ చెప్పుకొచ్చారు. తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు!
మెదక్లో జరిగిన విజయోత్సవ ర్యాలీ, సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ మేరకు కామెంట్స్ చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ చెప్పుకొచ్చారు. పైసలు, మందు ఓపెన్గా పంచినా మిగితా పార్టీల నేతలు ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని రఘునందన్ రావు తెలిపారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/07/imresizer-1690024621346.jpg)
Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు. రెవంత్ రెడ్డి రాజ