Balineni Srinivasa Reddy : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసిన ఏపీ మాజీ మంత్రి
తెలంగాణ లో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు పబ్లిక్ గా చెప్పారు. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు
- By Sudheer Published Date - 09:26 PM, Sat - 9 December 23
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ఏ స్థాయిలో జరిగాయో చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ (Betting) లు జరిగాయి. మాములుగా IPL క్రికెట్ టైములో ఏ విధంగా బెట్టింగ్స్ చేస్తారో అంతకు మించి చేసారు. వేలు , లక్షలు కాదు కోట్లలో కూడా బెట్టింగులు జరిగాయి. కేవలం తెలంగాణాలో కాదు పక్క రాష్ట్రం ఏపీ తో పాటు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరిపారు.
తాజాగా ఏపీ మాజీ మంత్రి..తెలంగాణ లో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు పబ్లిక్ గా చెప్పారు. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు వెల్లడించారు. మరో వ్యక్తి తెలంగాణ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. కానీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినా.. తాను పందాన్ని రద్దు చేసినట్లు బాలినేని వెల్లడించారు. అంతే కాదు ప్రస్తుత రాజకీయాల ఫై చేసిన కామెంట్స్ సైతం వైరల్ గా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతుందని, ఈనాటి రాజకీయాలు అన్నీ కుల ప్రాతిపదికగా జరగుతున్నాయన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నట్లు బాలినేని వెల్లడించారు. తాను అన్నీ నిజాలే మాట్లాడతానన్న బాలినేని.. డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టారు. లేనిపక్షంలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు సినిమాలపై ఇష్టం ఉండేదని, సినిమా తీయాలని కోరికగా ఉండేదన్నారు. ఇప్పుడు సినిమాల వైపే వెళ్లాలని ఉందని, ఇక్కడ ప్రజలు తనను కావాలనుకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. సీఎం జగన్ అంటే తనకు చాలా ఇష్టమన్న బాలినేని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also : TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని
Related News
Rythu Bandhu: నేను రోడ్డెక్కినందుకే రైతు బంధు ఇచ్చిండ్రు: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం తన 'పోరు బాట' బస్సు యాత్రకు భయపడి రైతులకు 'రైతు బంధు' ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిందని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.