Akbaruddin Owaisi Key Comments : మా బ్రదర్స్ ను హత్య చేస్తారేమో..?
మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు
- Author : Sudheer
Date : 16-04-2024 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయంలో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన కామెంట్స్ ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తుంది. మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని..అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అంటూ అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలో అనేక అనుమానాలకు దారితీస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎంఐఎం పార్టీ..రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న వారికీ సపోర్ట్ చేస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధికి చేయూత ఇచ్చారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో కూడా స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మిగతా పార్టీలు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రెండు ఒకటే అని ప్రచారం చేస్తూ వస్తున్నాయి. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కాంగ్రెస్కు బీ టీమ్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ కాంగ్రెస్ నేతలే తమతో కలుస్తున్నారని అన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమతో కలిసి పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. ఎంఐఎంను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదన్న అక్బరుద్దీన్.. రావులు, రెడ్లు ఎంత మంది ఎలా కలిసి వచ్చినా గెలుపు తమదేనన్నారు.
అలాగే మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమని, హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు.
Read Also : Devara – Kalki : తెలుగు రాష్ట్రాల్లో దేవర, కల్కి.. థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో..