Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై అధిష్టానం సీరియస్..వేటు ఖాయం..
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయనను సస్పెండ్ చేయబోతున్నట్టు సమాచారం.
- By Hashtag U Published Date - 04:39 PM, Wed - 27 July 22
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయనను సస్పెండ్ చేయబోతున్నట్టు సమాచారం. సస్పెన్షన్ పై ఉమ్మడి నల్గొండ నేతలతో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు చేస్తున్నారట. షోకాజ్ నోటీస్ లేకుండానే సస్పెన్షన్ వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సాయంత్రం రాజగోపాలరెడ్డి నివాసానికి బీజేపీ నేతలు వెళ్లబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాజగోపాలరెడ్డితో బండి సంజయ్, ఈటల, వివేక్లు భేటీకానున్నారని, కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరికపై రాజగోపాలరెడ్డితో చర్చించనున్నారు.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.