Drugs : హైదరాబాద్లో డ్రగ్స్తో పట్టుబడ్డ 21 ఏళ్ల యువతి
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరంలో ఈవెంట్లకు పెద్ద ఎత్తున ప్రతిఏడాది డ్రగ్స్
- By Prasad Published Date - 09:14 AM, Tue - 2 January 24
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరంలో ఈవెంట్లకు పెద్ద ఎత్తున ప్రతిఏడాది డ్రగ్స్ వస్తుంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో డ్రగ్స్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసకుంటుంది. ఇందులో భాగంగానే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాపై పోలీసులు డేగకన్ను వేశారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్, సౌత్-ఈస్ట్ జోన్ బృందం, సోమవారం మలక్పేట వద్ద 21 ఏళ్ల మహిళ డ్రగ్ పెడ్లర్ను, నలుగురు డ్రగ్స్ వ్యాపారిని చాదర్ఘాట్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితులు ఎండీఎంఏ (యాంఫెటమైన్) డ్రగ్ను కలిగి ఉన్నారు. వారి నుంచి ఎనిమిది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులు ఆయేషా ఫిర్దౌస్, మాదకద్రవ్యాల వ్యాపారి, మరియు కిజరుద్దీన్ అనాస్, మొహదఫ్ఫాన్, అయాజ్ ఖాన్ మరియు షాబాజ్ షరీఫ్గా గుర్తించారు. వీరి నలుగురి వయస్సు 21 ఏళ్లుగా పోలీసులు తెలిపారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేటలోని నల్గొండ ఎక్స్రోడ్ వద్ద MDMA ఉన్న ఫిర్దౌస్ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఫిర్దౌస్ ముంబై వెళ్లి సైదాబాద్ ప్రాంతంలోని నలుగురు విద్యార్థుల కోసం ఎనిమిది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేశారు.. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్, చాదర్ఘాట్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
Also Read: Liquor Sale : న్యూఇయర్ రోజు ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఒక్కరోజే..?
Related News
Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి
ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి.