HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >76 Years For Veera Bairanpally Revolt This Is Special Story

Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు

మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.

  • Author : Pasha Date : 27-08-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bairanpally Martyrs Remembrance Day 2024

Bairanpally : బైరాన్‌పల్లి.. యావత్ తెలంగాణకు గర్వకారణం. ఈ పేరు వినగానే తెలంగాణ గడ్డ పులకించిపోతుంది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో బైరాన్‌పల్లి గ్రామం ఉంది. 1948 ఆగస్టు 27న ఈ పల్లెలో రజాకార్లు దారుణ నరమేధానికి పాల్పడ్డారు. ఆనాడు రజాకార్లపై వీరోచితంగా పోరాడి ఎంతోమంది బైరాన్‌పల్లి ముద్దుబిడ్డలు అమరులయ్యారు. వారి వీరోచిత పోరాటానికి నేటితో 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈసందర్భంగా కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.
  • అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు తెలంగాణ ప్రాంతం నిజాం నవాబు కబ్జాలోనే ఉండిపోయింది.
  • నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు, కూలీలు, కార్మికులు వీరోచిత సాయుధ పోరాటం చేశారు.
  • ఈ పోరాటంలో 1948 ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన ఎంతో చారిత్రాత్మకమైనది.
  • ఆ రోజున బైరాన్‌పల్లి గ్రామంలో రజాకార్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఊరికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు. నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి ఆదేశాలతో ఈ కాల్పులు జరిపారు.
  • రజకార్లు ఆనాడు తెలంగాణలోని గ్రామాలను లూటీ చేసేవారు.

Also Read :KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్

  • ఈక్రమంలోనే సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు తమ కేంద్రాలుగా వాడుకునేవారు. ఆ గ్రామాల్లో ఉంటూ సమీప పల్లెలపై దాడులకు తెగబడేవారు. ప్రజల సంపదను దోచుకునేవారు.
  • రజాకార్లను ఎదిరించేందుకు ఆనాడు ఎంతోమంది గ్రామీణ యువత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు.
  • బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట ప్రాంతాల్లో యువకుల  రక్షక దళాలు పనిచేశాయి. వీటికి కేంద్రంగా బైరాన్‌పల్లి ఉండేది.
  • 1948 ఆగస్టులో రజాకార్లు లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై దాడి చేసి సొమ్మును దోచుకున్నారు.
  • ఆ సంపదను దోచుకొని వెళ్తుండగా బైరాన్‌పల్లి(Bairanpally) సమీపంలోకి రాగానే సమరయోధులు దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలోని రక్షణ గెరిల్లా దళాలు దాడిచేశాయి. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నాయి.
  • ఈ ఘటనతో బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు  కసి పెంచుకున్నారు.
  • దీంతో బైరాన్‌పల్లి గ్రామస్థులు చుట్టూ గోడ ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న ఎత్తయిన బురుజును స్థావరంగా చేసుకుని ఊరిని రక్షించుకున్నారు.
  • రజాకార్లు రెండు సార్లు ఈ ఊరిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు.
  • ఆ దళాల్లో పనిచేసే యువతను భయపెట్టే లక్ష్యంతో 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు.
  • ఆగస్టు 27న వేకువజామున  బైరాన్‌పల్లి గ్రామస్తులు నిద్రిస్తుండగా, అప్పటి డిప్యూటీ కలెక్టరు హషీం 500 మంది సైన్యంతో ఊరిపై దాడి చేశారు. సైనికులు గ్రామంలోకి చొరబడి అందరినీ కాల్చి చంపారు.
  • బురుజుపై తలదాచుకున్న 40 మందిని, పలుచోట్ల దొరికిన 56 మంది యువకులను బంధించి ఊరి బయటకు ఈడ్చుకుంటూ వెళ్లి కాల్చి చంపారు.

Also Read :Telegram: కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌లో టెలిగ్రామ్ నిషేధం..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bairanpally
  • Bairanpally Martyrs Remembrance Day
  • telangana

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd