Free Power Scheme: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 1.05 కోట్ల ఇళ్లు
ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది . ఈ హామీని అమలు చేయడం వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కించాలని తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలను కోరింది.
- By Praveen Aluthuru Published Date - 04:21 PM, Thu - 18 January 24
Free Power Scheme: ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది . ఈ హామీని అమలు చేయడం వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కించాలని తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలను కోరింది. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్లు 1,38,48,000కు పైగా ఉన్నట్లు గుర్తించారు . వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగదారులు 1,05 కోట్ల మంది ఉన్నారు. ఈ కనెక్షన్లపై నెలవారీ విద్యుత్ బిల్లులపై 350 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ 1.05 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది .
ప్రస్తుతం, రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటు ధర రూ. 7.07. 200 యూనిట్ల వినియోగదారులు ప్రస్తుతం ACS కంటే తక్కువ వసూలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏడాదికి విద్యుత్ సంస్థలకు 4,200 కోట్లు చెల్లించాలి. కొత్త బడ్జెట్ లో ఈ పథకానికి నిధుల కేటాయింపు అంశంపై స్పష్టత రానుంది. 1.05 కోట్ల కుటుంబాలకు చెందిన ఉచిత విద్యుత్తు వినియోగదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద చేరాలనుకునే వినియోగదారుల విద్యుత్ కనెక్షన్ల వివరాలన్నింటినీ అందులో నమోదు చేయాలి.
కర్ణాటకలో కూడా యూజర్లు నేరుగా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు. అక్కడి ప్రభుత్వం గత ఆగస్టు నుంచి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది .అదే విధంగా ఇక్కడ కూడా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్ల నుంచి వివరాలు సేకరిస్తోంది. వినియోగదారుడి విద్యుత్ కనెక్షన్ వివరాలను పోర్టల్లో నమోదు చేయగానే గత ఆర్థిక సంవత్సరంలో నెలకు వినియోగించిన సగటు యూనిట్ల సంఖ్య తెలుస్తుంది. అదే సగటు ప్రకారం కర్ణాటకలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వబడుతుంది. తెలంగాణలోనూ ఇదే పద్ధతిని అనుసరించాలా లేక మొత్తం 1.05 లక్షల మంది వినియోగదారులకు 200 యూనిట్లు ఇవ్వాలా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే అన్ని గృహ కనెక్షన్లకు సోలార్ విద్యుత్ అందజేస్తే ఎలా ఉంటున్నది పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తున్నది. అయితే సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు దాదాపు 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఏడాదికి 2880 యూనిట్లు ఉత్పత్తి అవుతాయని గుర్తించారు. ప్రస్తుత ధరల ప్రకారం రెండు కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఏర్పాటుకు రూ.1.30 లక్షలు ఇందులో కేంద్రం రూ. 36 వేలు సబ్సిడీగా అందజేస్తున్నారు. ప్రతి కనెక్షన్కు సోలార్ పవర్ యూనిట్ను ఏర్పాటు చేసే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం ఎలా భరిస్తుందన్నది చూడాలి.
Also Read: Ram Temple: రామమందిరం ప్రారంభోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హాఫ్ డే లీవ్
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�