Whatsapp: రేపటి నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్.. అవి ఇవే..!
సెక్యూరిటీ ఫీచర్ల అప్గ్రేడ్, యూజర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ దృష్ట్యా వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Author : Gopichand
Date : 23-10-2022 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
సెక్యూరిటీ ఫీచర్ల అప్గ్రేడ్, యూజర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ దృష్ట్యా వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్లలో ఈ నెల 24 నుంచి తమ సర్వీస్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఓఎస్తో పనిచేస్తున్న ఐఫోన్లలో, ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్ ఓఎస్తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. తర్వాతి వెర్షన్కు యూజర్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్కువగా ఉపయోగించే యాప్లలో Whatsapp ఒకటి. ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశంలో 500 మిలియన్లకుపైగా అకౌంట్స్ ఉన్నాయి. దీపావళి సీజన్ దగ్గర పడుతున్నందున చాలా మంది వినియోగదారులు యాప్లో శుభాకాంక్షలు, వీడియోలు, ఫోటోలను సెండ్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో Whatsapp తీసుకున్న ఓ నిర్ణయం యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. అక్టోబర్ 24 (సోమవారం) నుండి, iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్లతో నడుస్తున్న iPhoneలలో WhatsApp సేవలు నిలిచిపోనున్నాయి. యాప్ని ఉపయోగించాలంటే వినియోగదారులు తమ iOSని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
iOS, Whatsappని నవీకరించిన తర్వాత iPhone 5, iPhone 5C వినియోగదారులు Whatsappని ఉపయోగించగలరు. అయితే వాట్సాప్ ఇకపై iPhone 4, iPhone 4Sకి సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ ఫోన్ల వినియోగదారులు వాట్సాప్ ని ఉపయోగించడం కొనసాగించడానికి కొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవేళ మీ iPhone ఆటో అప్డేట్లో లేనట్లయితే సెట్టింగ్లు>జనరల్>సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం ద్వారా మీరు iOS వెర్షన్ను అప్డేట్ చేసుకోవచ్చు. Android వినియోగదారులకు Whatsappని ఉపయోగించడం కొనసాగించడానికి Android 4.1 లేదా తదుపరి వెర్షన్ అవసరమని వాట్సాప్ తెలిపింది.