WhatsApp: 47 లక్షల భారతీయ వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. గత నాలుగు నెలల్లో ఇదే టాప్..!
మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది.వాట్సాప్ (WhatsApp) ద్వారా నిషేధించబడిన భారతీయ ఖాతాల సంఖ్య, వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు నివేదికలో ఉన్నాయి.
- By Gopichand Published Date - 06:30 AM, Tue - 2 May 23
మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది.వాట్సాప్ (WhatsApp) ద్వారా నిషేధించబడిన భారతీయ ఖాతాల సంఖ్య, వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు నివేదికలో ఉన్నాయి. కొత్త నివేదిక ప్రకారం.. మార్చి 2023లో వాట్సాప్ భారతదేశంలోని 47 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 45 లక్షలు. మార్చి 2023లో అందిన ఫిర్యాదుల మేరకు 47 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. అంతకుముందు ఫిబ్రవరిలో 45 లక్షలు, జనవరిలో 29 లక్షలు, డిసెంబర్లో 36 లక్షలు, 2022 నవంబర్లో 37 లక్షల ఖాతాలు స్తంభించాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్) రూల్ 4(1)(D) ప్రకారం ఈ ఖాతాలు నిషేధించబడ్డాయి. నిషేధిత ఖాతాలు భారతీయ చట్టాలను లేదా వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించిందని వాట్సాప్ తెలిపింది. మార్చి 1- మార్చి 31 మధ్య WhatsApp 4,715,906 కంటే ఎక్కువ మంది భారతీయ వినియోగదారుల ఖాతాలను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల కారణంగా దాదాపు 1,659,385 ఖాతాలు నిషేధించబడ్డాయి.
Also Read: Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 44 ప్రత్యేక రైళ్లు
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28, 2023 మధ్య WhatsApp 4,597,400 కంటే ఎక్కువ మంది భారతీయ వినియోగదారుల ఖాతాలను నిషేధించింది. అదనంగా వాట్సాప్కు 4,720 ఫిర్యాదు నివేదికలు అందాయని కొత్త నివేదిక చూపిస్తుంది. వీటిలో 4,316 నిషేధాలపై అప్పీల్ చేయగా, వాట్సాప్ 553 మందిపై మాత్రమే చర్య తీసుకుంది. IT నిబంధనల ప్రకారం.. 5 మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రతి నెలా సమ్మతి నివేదికలను ప్రచురించాలి. ఇందులో వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఉంది. ప్రభుత్వం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రారంభించింది. ఇది కొత్త పోర్టల్లో వారి ఫిర్యాదులను నమోదు చేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Related News
ATM Fraud: ఏటీఎం కార్డ్ ట్రాప్ స్కామ్ అంటే ఏమిటి? సైబర్ మోసగాళ్ల కొత్త రూట్ ఇదే..!
ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుండగా మరోవైపు భద్రతా ఉల్లంఘన ప్రమాదం కూడా ఉంది.