Samsung Galaxy M13 5G ఫీచర్స్..లీక్, ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కంపెనీ అయిన శాంసంగ్ ...గెలాక్సీ ఎమ్ సిరీస్ లో భాగంగా...M13 5G స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది.
- By hashtagu Published Date - 04:32 PM, Thu - 23 June 22
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కంపెనీ అయిన శాంసంగ్ …గెలాక్సీ ఎమ్ సిరీస్ లో భాగంగా…M13 5G స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధం చేసింది. అయితే విడుదలకు ముందు ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ నుంచి 4జీ వెర్షన్ రిలీజ్ అయ్యింది. లీక్ అయిన సమాచారం బట్టి…ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు లీక్…
గెలాక్సీ M13 5Gస్మార్ట్ ఫోన్ 6.5అంగుళాల ఎల్ సీఈడీ డిస్ ప్లేతో HD+రిజల్యూషన్, 269నిట్స్ పిక్సెల్ డెన్సిటీతో వస్తుందని రిపోర్టు పేర్కొంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700చిప్ ద్వారా రన్ అవుతుంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో ఈ ఫోన్ రానుంది. కంపెనీ ర్యామ్ ఫీచర్ ను అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఆప్టిక్స్ పరంగా…శాంసంగ్ గెలాక్సీ M13ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలను తీసుకునేందుకు 5మెగాపిక్సెల్ సెన్సార్ కూడా వస్తుంది. హుడ్ కింద 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ 15వాట్స్ ఛార్జింగ్ సపోర్టును మాత్రమే అందిస్తుందని నివేదించింది.
ఇక ఈ హ్యాండ్ సెట్ బ్లూ, బ్రౌన్, గ్రీన్ తో సహా మూడు కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుందని నివేదిక తెలిపింది. శాంసంగ్ ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శాంసంగ్ ఫోన్ల ధరూ. 15వేల సెగ్మెంట్స్ లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గెలాక్సీ ఎం13 4జి మోడల్ స్పెసిఫికేషన్స్….
ఈ ఫోన్ 4జి మోడల్ ఇప్పటికే ఇండియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. 6.6 అంగుళా ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తుంది. హుడ్ కింద శాంసంగ్ ఇంట్లో ఎగ్జినోస్ 850 SOCని కలిగి ఉంది. 4జి మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇక ఈ డివైజ్ 15వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 4జివెర్షన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో అందించనున్నాయి.
Related News
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.