HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Oneplus Is Launching Two Desktop Monitors

OnePlus: రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు లాంచ్‌ చేస్తున్న వన్‌ ప్లస్‌..

ఇండియన్‌ మార్కెట్‌లో వన్‌ ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Author : Maheswara Rao Nadella Date : 04-12-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onepluse Moniters X27, E24
Onepluse Moniters X27, E24

ఇండియన్‌ మార్కెట్‌లో వన్‌ ప్లస్‌ (OnePlus) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం ఫీచర్లతో మిడ్‌ రేంజ్‌ ఫోన్లను రిలీజ్​ చేయడం వన్‌ ప్లస్‌ ప్రత్యేకత. అందుకే వన్‌ ప్లస్‌ బ్రాండ్​ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ ఫోన్లు (Smart Phones) హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఇప్పుడు ఇదే పాపులారిటీతో తన మార్కెట్‌ను మరింతగా విస్తరించే పనిలో వన్‌ ప్లస్‌ ఉంది. ఇందులో భాగంగానే డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్​ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లను రిలీజ్​ చేసేందుకు సిద్దమవుతోంది. వన్‌ ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్​ పేజీలో పెట్టిన టీజర్​లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీ డ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది.

The #OnePlusMonitors are here to change the game. Stay tuned: https://t.co/YE8W06LvdR #OnePlus #NeverSettle pic.twitter.com/Jzx6vP5H0g

— OnePlus India (@OnePlus_IN) November 30, 2022

లీకైన వన్‌ప్లస్‌​ మానిటర్ల ఫీచర్లు:

వన్‌ ప్లస్‌ ఎక్స్​27 మానిటర్​ మోడల్​ 27 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్‌ ప్లస్‌ ఎక్స్​ 24 మోడల్​ 24 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. వీటిలో ఓ మోడల్​ పోట్రయిడ్​ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ అదిరిపోతుందని వన్‌ ప్లస్‌ తన టీజర్​లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఎక్స్​ 27 మానిటర్​ ప్రీమియం రేంజ్​, ఈ24 మానిటర్ మిడ్‌ రేంజ్‌లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.

దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న వన్‌ప్లస్‌:

వన్‌ ప్లస్‌ తన ప్రోడక్ట్ పోర్ట్​ఫోలియోను క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లు మాత్రమే రిలీజ్​ చేసిన సంస్థ క్రమంగా మిడ్​ రేంజ్​ మార్కెట్‌ను ఆక్రమించింది. కేవలం రూ.25 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల ఫోన్లను విక్రయిస్తోంది. దీంతో ఇండియాలో చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్​ బ్రాండ్‌గా నిలిచింది. ఈ పాపులారిటీని కాపాడుకుంటూనే క్రమంగా వేరే ప్రొడక్ట్స్‌ను మార్కెట్​లోకి తీసుకొస్తోంది. నెక్‌ బ్యాండ్స్‌, ఇయర్‌ బడ్స్‌, ఇతర ఆడియో ప్రొడక్ట్‌లను లాంచ్​ చేస్తుంది. ఇటీవలే స్మార్ట్‌ వాచ్‌లను కూడా లాంచ్​ చేసింది. మరో వైపు స్మార్ట్‌ టీవీల మార్కెట్‌లోనూ వన్‌ ప్లస్‌ జోరు కొనసాగుతోంది. ఇండియాలో ప్రస్తుతం టాప్​ 3 స్మార్ట్​ టీవీ బ్రాండ్లలో వన్‌ ప్లస్‌ ​ ఒకటిగా ఉందని కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​ నివేదిక వెల్లడించింది.

ఇప్పుడు డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టి, ఇండియా ఎలక్ట్రానిక్​ ఇండస్ట్రీలో టాప్​ ప్లేస్​ లక్ష్యంగా కృషి చేస్తోంది. రియల్​మీ, వన్‌ ప్లస్‌ కంపెనీలు ఇతర ఇండియన్‌ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే నాణ్యమైన ప్రొడక్ట్‌లను రిలీజ్​ చేస్తుండటంతో గణనీయమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • desktop
  • features
  • launch
  • Monitor
  • OnePlus
  • technology

Related News

Instagram

ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

ఈ మార్పుకు గల కారణాలను మెటా అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇంటర్నెట్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) పట్ల పెరుగుతున్న ఆందోళనల కారణంగానే ఈ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు భావిస్తున్నారు.

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd