Lava Blaze NXT: భారత్ లో లావా బ్లేజ్ NXT స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్లు ఇవే?
ఇండియన్ టెక్ కంపెనీ లావా ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేసిన
- By Nakshatra Published Date - 05:35 PM, Sat - 26 November 22
ఇండియన్ టెక్ కంపెనీ లావా ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ ఫోన్ మార్కెట్ లో పాపులర్ బ్యాండ్లలో లావా కూడా ఒకటిగా నిలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లావా ఇండియాలో లావా బ్లేజ్ NXT అనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది 4జీబీ 64జీబీ సింగిల్ కాన్ఫిగరేషన్లోనే లభించనుంది. స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ 37 SoC చిప్సెట్తో పనిచేయనుంది. లావా బ్లేజ్ మార్క్ వాటర్డ్రాప్ నాచ్తో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్తో క్లాసీగా చూడడానికి అద్భుతమైన లుక్ లో కనిపిస్తోంది.
ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన లావా బ్లేజ్ మోడల్ కు సక్సెసర్గా కంపెనీ కొత్త ఫోన్ ను రూపొందించింది. ఇకపోతే విడుదల చేసిన లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లావా బ్లేజ్ NXT ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్తో 6.5 అంగుళాల హెచ్డీ + IPS డిస్ప్లేతో లభించనుంది. అలాగే 3.5mm హెడ్ఫోన్ జాక్తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది. బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా లావా అందించింది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. లావా బ్లేజ్ NXT ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ 30 fps వద్ద 1080పి ఫుల్ హెచ్డీ వీడియోలను రికార్డ్ . ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది. కాగా ఈ లావా బ్లేజ్ NXT ఫోన్ ధర ధర విషయానికి వస్తే.. స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,299గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, రెడ్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. కంపెనీ ఈ కొత్త మోడల్ను ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Related News
Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాల జోక్యం.. ఇండియా సమాధానమిదే
Kejriwal: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఇతర దేశాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. జర్మనీ అమెరికా దేశాలు అరెస్టును తప్పు పట్టాయి. భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పార