ISRO: అంతరిక్ష ప్రయోగాలలో మరో మైలురాయి దాటిన ఇస్రో?
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో తాజాగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఇస్రో రీయూజబుల్
- By Nakshatra Published Date - 06:26 PM, Wed - 9 November 22
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో తాజాగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ మొదటి రన్ వే ల్యాండింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించబోతున్నారు. ఇప్పటి వరకూ ఉపగ్రహాలను అంతరిక్షం లోని కక్ష్యల్లో ప్రవేశ పెట్టేందుకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాహక నౌకలను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇవి పునర్వియోగానికి ఉపయోగపడవు కాబట్టి,మళ్లీ తయారు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అయితే ఈ సమస్యకు పరిష్కారంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది ఇస్రో. దాని ద్వారా ఉపయోగించిన వాహక నౌక ను మళ్లీ మళ్లీ ఉపయోగించు కోవచ్చు. అయితే 2016లో మొదటిసారి జరిపిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ మొదటి రన్వే ల్యాండింగ్ ప్రయోగానికి ప్రయోగానికి సిద్ధం చేశారు. కర్ణాటక చిత్రదుర్గ లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో దీనిని ప్రయోగించేందుకు అనువైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
కాగా ఈ ప్రయోగంలో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ వింగ్ బాడీని హెలిక్యాప్టర్ ద్వారా మూడు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. రన్వే నుండి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో విడుదల చేస్తారు. చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్ఫీల్డ్లో అది ల్యాండ్ అవుతుంది. ఇస్రో చరిత్రలో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ మరో మైలు రాయి అని అధికారులు చెబుతున్నారు.
Tags
Related News
Firefox Browser Users: ఈ బ్రౌజర్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఎందుకంటే..?
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఫైర్ఫాక్స్ బ్రౌజర్ వినియోగదారులకు (Firefox Browser Users) హై అలర్ట్ జారీ చేసింది.