Samsung: మీరు కూడా శాంసంగ్ ఫోన్ ఉపయోగిస్తున్నారా.. అయితే మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో చెక్ చేసుకోండిలా?
టెక్నాలజీ ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుండగా మరొకవైపు సైబర్ నేరగాళ్లు కూడా అమాయకమైన ప్రజలను టార్గెట్ చేసి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం
- By Nakshatra Published Date - 02:30 PM, Sun - 17 December 23
టెక్నాలజీ ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుండగా మరొకవైపు సైబర్ నేరగాళ్లు కూడా అమాయకమైన ప్రజలను టార్గెట్ చేసి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడంతో పాటు వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుంటూ అమాయకమైన ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్లు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సేవలకు కూడా మొబైల్ ఫోన్లు, మొబైల్ నెంబర్లు అనుసంధాన వేదికగా మారాయి. అదేమాదిరిగా అమాయకులను బుట్టలో వేసుకునే సైబర్ నేరగాళ్లు, మాయగాళ్లు కూడా ఉన్నారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నా కూడా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు అదే కోవలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ కూడా చేరింది.
ఆ సంస్థ తయారు చేసిన కొన్ని ఫోన్లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొందరు వినియోగదారులు హ్యాకింగ్ బారిన పడి ఉండొచ్చని కూడా అంచనా వేసింది. ఈ మేరకు కొన్ని హెచ్చరికలను కూడా జారీ చేసింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హై-రిస్క్ అలర్ట్లో 4 ఆండ్రాయిడ్ వర్షన్లు ఉన్నాయని ప్రభుత్వం కింద పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీ CERT-In తెలిపింది. మొబైల్ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారమే హ్యాకర్ల లక్ష్యమని నోడల్ ఏజెన్సీ చెబుతోంది. శాంసంగ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నవారిలో ఏయే ఫోన్లకు ముప్పు అధకంగా ఉందో వాటి పేర్లను తెలిపింది. ఆయా ఫోన్ల వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, హ్యాకింగ్ను నివారించడానికి వారు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవాలో కూడా వివరించింది.
అయితే ప్రభుత్వం ప్రకటన ప్రకారం, శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో 4 ఆండ్రాయిడ్ వెర్షన్లలో ఈ లోపాలు బయటపడ్డాయి. CERT-In ప్రకారం ఆండ్రాయిడ్ వర్షన్ 11, 12, 13, అలాగే వర్షన్ 14తో నడుస్తున్న శాంసంగ్ స్మార్ట్ఫోన్ల లోపాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కారణంగా ఆయా ఫోన్ లను సులభంగా హ్యాక్ చేయవచ్చు. తద్వారా మొబైల్లోని వ్యక్తిగత సమాచారాన్ని అలాగే సిమ్ పిన్ను కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చని CERT-In పేర్కొంది. మరి ఇంతకీ మొబైల్ హ్యాకింగ్ అయిందని ఎలా గుర్తించాలి అన్న విషయానికి వస్తే.. శాంసంగ్ వినియోగదారులు మొదట *#21# ను డయల్ చేయాలి. ఈ పని చేసిన వెంటనే మెసేజ్ లేదా ఇతర ఫీచర్ల ముందు Not forwarded అని కనిపిస్తే మీ మొబైల్ సురక్షితంగా ఉందని అర్థం. ఒకవేళ ఫార్వార్డెడ్ అని దాని ముందు రాసి ఉంటే, మీ మొబైల్ హ్యాక్ అయిందని, ఆ ఫోన్ డేటాను ఎవరో దొంగిలించారని అర్థం. మరి హ్యాకింగ్ నుంచి ఎలా బయటపడాలి అన్న విషయానికి వస్తే.. దీని కోసం మరో నంబర్కు డయల్ చేయాల్సి ఉంటుంది. ##002# టైప్ చేసి డయల్ చేసిన వెంటనే, మీ ఫోన్ హ్యాకింగ్ నుంచి బయటపడుతుంది.
ఆ క్షణం నుంచి మొబైల్ సురక్షితంగా మారుతుంది. అయితే అప్పటికే జరిగిన నష్టాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వెనువెంటనే పాస్వర్డ్లను మార్చడం, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడం ఉత్తమం. అయితే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందంటే మీ ఫోన్లోని ఫోటోలు, వీడియోలను సులభంగా కాపీ చేసుకోవచ్చు. అలాగే ఫోన్లో సేవ్ చేసిన నంబర్ లను కూడా హ్యాకర్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్లో సేవ్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరున్న లొకేషన్ కూడా హ్యాకర్లు తెలుసుకునే ప్రమాదం ఉంది. ఏ ఫోన్ అయినా సరే హ్యాకింగ్ బారిన పడకుండా కాపాడుకోనికి ప్రతి వినియోగదారుడు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ ఫోన్లో తాజా సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆ యాప్ కోసం ఇచ్చే పర్మిషన్ల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.