Aadhaar Card: ఆధార్ కార్డ్ యూజర్స్ కి హెచ్చరిక.. సెప్టెంబర్ 14 లోపు అది పూర్తి చేసుకోవాలంటూ!
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వారు మరికొన్ని రోజుల్లోనే ఆధార్ అప్డేట్ ని పూర్తి చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- By Anshu Published Date - 02:38 PM, Tue - 27 August 24

ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతి ఒక్క చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. దాదాపుగా ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగడం లేదు. అయితే అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డు విషయం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అధికారులు. చిరునామా విషయంలో అడ్రస్ చైంజ్ విషయంలో మార్పులు చేసుకోమని సూచిస్తూనే ఉన్నారు. చిరునామా, బయోమెట్రిక్స్ లేదా ఫోటోలో మార్పు కోసం ఆధార్ను అప్డేట్ చేయడం అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్లు నిండిన ఆధార్కార్డును వెంటనే అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది.
ఇప్పుడు మీరు 14 సెప్టెంబర్ 2024లోపు ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో అప్డేట్ చేస్తే, మీరు దీని కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదట. యూఐడీఏఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి మరోసారి ఆధార్ కార్డు దారులను అలర్ట్ చేసింది. ఉచిత ఆధార్ అప్డేట్ తేదీని 14 సెప్టెంబర్ 2024 వరకు ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ తేదీ జూన్ 14, 2024 వరకు ఉండేది. అయితే ఈ ఉచిత ఆధార్ సేవ మీకు మై ఆధార్ పోర్టల్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే మీరు మీ ఆధార్ ను అప్డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళితే, మీరు దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
మరి అప్డేట్ చేసుకోవడానికి ఏమేం పత్రాలు కావాలి అన్న విషయానికి వస్తే.. ఆధార్ను అప్డేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, చిరునామా రుజువును కలిగి ఉండాలి. మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డును, చిరునామా కోసం ఓటర్ కార్డును ఉపయోగించవచ్చు. ఉచిత ఆధార్ను అప్డేట్ చేసే తేదీని పొడిగించడం ఇది మూడోసారి. అటువంటి పరిస్థితిలో మీ ఆధార్ కూడా అప్డేట్ కాకపోతే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇంట్లో కూర్చుని కూడా అప్డేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అందుకోసం. ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్సైట్ myaadhaar.uidai.gov.in సందర్శించాలి.
ఆధార్ నంబర్తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. దీని తర్వాత, UIDAI వెబ్సైట్లో కనిపించే పేజీలో, చిరునామా అప్డేట్పై క్లిక్ చేసి, ఆపై అప్డేట్ ఆధార్ ఆన్లైన్పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగే పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు అప్డేట్ చేయాల్సిన సమాచారాన్ని నమోదు చేసి ప్రాసెస్ టు అప్డేట్ ఆధార్పై క్లిక్ చేయాలి. పై విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు ఆధార్ కార్డును సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.