Telangana
-
#Speed News
EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్పల్లి డిపో నుంచి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటిలో 545 బస్సులు హైదరాబాద్ నగర పరిధిలోనే సేవలందిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద అదనంగా […]
Date : 27-05-2026 - 3:17 IST -
#Speed News
Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంక్షేమం, సాధికారత కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త నమూనాలను అధికారికంగా ఆవిష్కరించారు. ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా ఈసారి కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల కలయికలతో చీరలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానిక వస్త్ర తయారీ, పంపిణీ వ్యవస్థలను కూడా ప్రోత్సహించడం లక్ష్యంగా […]
Date : 26-05-2026 - 12:46 IST -
#Speed News
Telangana : తెలంగాణలో రుతుపవనాలు మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాల కదలిక మందగించిందని.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్డి పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎల్ నినో ప్రభావం కారణంగా అవి జూన్ 5 నుంచి 10 మధ్య రాష్ట్రంలోకి చేరుకునే అవకాశం ఉందని […]
Date : 26-05-2026 - 9:22 IST -
#Speed News
ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్
ఓ యువకుడి స్పీడ్ మోజు చివరకు కటకటాలపాలు చేసింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన మే 19న జరిగినప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు అల్కాపూర్కు చెందిన శ్రీకరింగుల సాయిరామ్గా గుర్తించారు. నర్సింగి టోల్గేట్ నుంచి అప్పా […]
Date : 25-05-2026 - 1:19 IST -
#Speed News
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో నాలుగు సార్లు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత పదిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 2.84, లీటర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6గంటల నుంచి అమలవుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఏర్పడిన ఒత్తిడిని భర్తీ […]
Date : 25-05-2026 - 8:23 IST -
#Speed News
FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఎల్ & టీ గెస్ట్హౌస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబత్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్కు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భవనం రెండు వైపులా విస్తరించి ఉందని, అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఒక వైపు పూర్తిగా […]
Date : 25-05-2026 - 7:50 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్లోని వాహనాలు తగ్గింపు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి సచివాలయానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు.. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, జామ్మర్ వాహనం లేకుండా కేవలం మూడు వాహనాల కాన్వాయ్లో ప్రయాణించారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదు. […]
Date : 24-05-2026 - 3:37 IST -
#Telangana
Road Accident : కోదాడ సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలకు గురైన బస్సులు తాజాగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, కోదాడ్ పట్టణం సమీపంలో జాతీయ రహదారి 65పై ప్రవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి లారీని వేగంగా ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు యోలో ట్రావెల్స్కు చెందినదిగా పోలీసులు […]
Date : 24-05-2026 - 11:34 IST -
#Telangana
Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రోజురోజుకూ నిప్పుల కుంపటిగా మారుతోంది. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు […]
Date : 23-05-2026 - 4:51 IST -
#Telangana
Condom Packet: బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్
బీర్ బాటిళ్లలో పురుగులు, బల్లులు రావడం గురించి విన్నాం. కానీ, ఏకంగా సీల్ చేసిన బీరు బాటిల్లోనే కండోమ్ ప్యాకెట్ రావడం సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బీరు ప్రియులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఓ వ్యక్తి కింగ్ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి కొన్ని బీర్లు తాగిన తర్వాత, సీల్ తీయని మరో బాటిల్ను […]
Date : 20-05-2026 - 10:50 IST -
#Telangana
Telangana: స్టార్ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
ponnam prabhakar తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాటి కల్లుపై సమాజంలో […]
Date : 15-05-2026 - 11:41 IST -
#Telangana
Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్లో కొత్త పాలసీ!
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి […]
Date : 08-05-2026 - 10:33 IST -
#Telangana
Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది
Date : 02-05-2026 - 3:03 IST -
#Telangana
Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గతంలో విడివిడిగా జరుగుతున్న కొనుగోళ్ల వల్ల జవాబుదారీతనం లోపించిందని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై ఒకే గొడుగు కింద పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది
Date : 01-05-2026 - 3:12 IST -
#Telangana
CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
ఈ రోజు ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్ కు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయనకు క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు విశేషమైన అనుభవం ఉంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన సమయంలో మావోయిస్టు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని శాంతిభద్రతలను కాపాడారు. హైదరాబాద్, […]
Date : 01-05-2026 - 11:38 IST