Telangana
-
#Speed News
Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా […]
Date : 31-05-2026 - 4:32 IST -
#Speed News
Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భవిత ” బంగారు భవిష్యత్ కోసం అండగా
మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే పాలిసెట్లో రాష్ట్ర స్థాయిలో 634వ ర్యాంక్ సాధించింది. అయితే కుటుంబ ఆర్థిక […]
Date : 31-05-2026 - 8:26 IST -
#Speed News
TPCC : హైదరాబాద్లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన జగన్నారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలం కీలకమని.. ఎన్నికల సంవత్సరం సమీపిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన భేటీ కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, […]
Date : 31-05-2026 - 7:38 IST -
#Speed News
Road Accident : ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సర్వణకాంతి […]
Date : 30-05-2026 - 9:51 IST -
#Speed News
T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్లో ప్రత్యేక తరగతులు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల పరిధిలో 1,420 పోస్టులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు […]
Date : 30-05-2026 - 6:28 IST -
#Speed News
CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరమైన అంశాల్లో రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని, విచారణ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా అవకాశాలు కల్పిస్తోందని పేర్కొంటున్నారు. ఇటీవల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై నమోదైన కేసులు, అరెస్టులను ఉదాహరణగా చూపిస్తూ, […]
Date : 30-05-2026 - 6:15 IST -
#Speed News
Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను తెలుగు ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రతీకగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాట పటిమ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలు, డా. బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన సామాజిక సమానత్వ భావనలు రేవంత్ రెడ్డి పాలనలో ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలు, దళితులు, […]
Date : 30-05-2026 - 3:00 IST -
#Speed News
Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన
దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పిస్తుందని.. రోడ్లపై నమాజ్ చేయడం తప్పు […]
Date : 30-05-2026 - 8:39 IST -
#Speed News
Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల […]
Date : 29-05-2026 - 6:38 IST -
#Speed News
Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాటవేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు
రబీ వరి ధాన్యం సేకరణలో జాప్యం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రులు సమాధానం ఇవ్వకుండా సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి […]
Date : 29-05-2026 - 6:15 IST -
#Speed News
HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్జెండర్లకు చోటు
సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్జెండర్ సమాజానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త ఆశాకిరణంగా నిలిచింది. హైడ్రా ఏర్పాటు చేసిన ‘ఈగిల్ టీమ్’లో 16 మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరు హైడ్రా సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పార్కులు […]
Date : 29-05-2026 - 4:38 IST -
#Speed News
NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ ముస్తాబైంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని మహానేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:09 IST -
#Speed News
Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. మంచిర్యాల డీఆర్వోగా నిర్మల్ తహసీల్దార్ ఎ. మోతీరామ్, పెద్దపల్లి డీఆర్వోగా కరీంనగర్కు చెందిన బి. రాజేశ్వరి, జగిత్యాల డీఆర్వోగా […]
Date : 27-05-2026 - 7:40 IST -
#Speed News
EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్పల్లి డిపో నుంచి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటిలో 545 బస్సులు హైదరాబాద్ నగర పరిధిలోనే సేవలందిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద అదనంగా […]
Date : 27-05-2026 - 3:17 IST -
#Speed News
Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న ఇందిరమ్మ చీరల సరికొత్త డిజైన్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంక్షేమం, సాధికారత కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త నమూనాలను అధికారికంగా ఆవిష్కరించారు. ఇందిరమ్మ చీరల పథకంలో భాగంగా ఈసారి కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల కలయికలతో చీరలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానిక వస్త్ర తయారీ, పంపిణీ వ్యవస్థలను కూడా ప్రోత్సహించడం లక్ష్యంగా […]
Date : 26-05-2026 - 12:46 IST