Rishabh Pant: పంత్ టీమిండియాలోకి కష్టమేనా..?
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరమైపోయాడు.గత ఏడాది డిసెంబర్ నెలలో అతను ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
- By Praveen Aluthuru Published Date - 07:56 PM, Sat - 20 January 24
Rishabh Pant: టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరమైపోయాడు.గత ఏడాది డిసెంబర్ నెలలో అతను ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టం కొద్ది ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే పంత్ రీ ఎంట్రీ గ్రాండిగా ఉంటుందనుకుంటే టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తొలుత రిషబ్ పంత్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడతాడని అంతా భావించారు. పంత్ రీఎంట్రీ కోసం అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ పంత్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడికి టీమిండియాలో చోటు కష్టమే అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వరల్డ్ కప్ చేజారినా.. టి20 ప్రపంచ కప్ ను మాత్రం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న భారత్ సీనియర్ ఆటగాళ్లను రంగంలోకి దింపుతోంది. సీనియర్ జూనియర్స్ తో భారత జట్టు ప్రత్యర్థుల్ని మట్టికరిపించి విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రణాళికలు వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గాయాల బారీన పడిన స్టార్ ఆటగాళ్లను రెడీ చేస్తున్నాడు. అందులో పంత్ పేరు కూడా ఉండటంతో జట్టుకు తిరుగులేదని అందరూ భావిస్తే.. జహీర్ మాత్రం పొట్టి ప్రపంచకప్ కు పంత్ ని సెలెక్ట్ చేయకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది.
పంత్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తే.. అందరికి సంతోషమే. కానీ అతడు పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించడం చాలా ముఖ్యం. పంత్ మునుపటి ఫామ్ ను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇవన్నీ పంత్ ముందున్న కఠినమైన ఛాలెంజెస్ . వీటన్నిటిని లెక్కలోకి తీసుకుంటే.. పంత్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినా.. సెలెక్టర్లు అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారని నేను భావించడంలేదు. పైగా జట్టులో గత సంవత్సర కాలంగా ఎంతో మంది యంగ్ ప్లేయర్లు వచ్చి సత్తా చాటుతున్నారు. దీంతో అతడికి టీమిండియాలో చోటు కష్టమే అని చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్. దీంతో పాటు టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ లోకి ఎంపిక చేయాల్సిన నలుగురి పేర్లను వెల్లడించాడు. షమి, బుమ్రా, సిరాజ్ కచ్చితంగా జట్టులో ఉండాలన్నాడు. వాళ్ల తర్వాత అర్ష్దీప్ రూపంలో కాస్త వేరియేషన్ లభిస్తుంది. అతడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. మంచి యార్కర్లు వేస్తాడని హజీర్ ఖాన్ వాళ్ళ నలుగురిని చూస్ చేసుకున్నాడు.
Also Read: Ayodya – Hanuman : నార్త్ లో ఓ పక్క అయోధ్య ..మరోపక్క హనుమాన్..రెండు రికార్డులే
Related News
MI vs KKR: ముంబైకి డూ ఆర్ డై.. ఇవాళ ఓడితే ఇంటికే..!
ఐపీఎల్లో నేడు అంటే శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ని వారి స్వగృహంలో ఢీకొంటుంది.