WI vs IND: జైస్వాల్ ఖాతాలో మరో రికార్డ్
ఫ్లోరిడా మైదానంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ 51 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో అజేయంగా నిలిచాడు
- By Praveen Aluthuru Published Date - 05:50 PM, Sun - 13 August 23
WI vs IND: ఫ్లోరిడా మైదానంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ 51 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. 21 ఏళ్లలో ఆ ఫీట్ సాధించటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫీట్ సాధించిన జైస్వాల్ సచిన్-గవాస్కర్ల ప్రత్యేక క్లబ్లోకి చేరాడు. యశస్వి జైస్వాల్ 21 సంవత్సరాల వయస్సులో ఓపెనర్గా మూడు 50 ప్లస్ స్కోర్లు చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ మరియు సునీల్ గవాస్కర్ల ఎలైట్ క్లబ్లో చేరారు. వెస్టిండీస్తో జరిగిన 4వ టీ20లో యశస్వి 50కి పైగా పరుగులు చేశాడు. ఇంతకు ముందు టెస్టు క్రికెట్లో రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. జైస్వాల్ 21 ఏళ్ల వయసులో 50 ప్లస్ స్కోరర్ల జాబితాలో 4వ స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. అతను 21 ఏళ్ల వయసులో ఓపెనర్గా 50 ప్లస్ 12 సార్లు స్కోర్ చేశాడు. దీని తర్వాత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ 7 సార్లు ఈ ఘనత సాధించాడు. మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే మూడో స్థానంలో ఉన్నాడు. అతను 50 ప్లస్ 4 సార్లు స్కోర్ చేశాడు. దీని తర్వాత యశస్వి జైస్వాల్ పేరు నమోదైంది. శుభమాన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్గా గిల్ 50 ప్లస్ 4 సార్లు స్కోర్ చేశాడు.
వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ తన అంతర్జాతీయ T20 కెరీర్లో మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ 21 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. జైస్వాల్ 21 ఏళ్ల 227 రోజుల వయసులో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. 14 ఏళ్ల క్రితం 22 ఏళ్ల 41 రోజుల్లో భారత్ తరఫున రోహిత్ టీ20లో హాఫ్ సెంచరీ సాధించాడు.
Also Read: Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !
Related News
RR vs MI: రఫ్పాడించిన రాజస్థాన్.. శతక్కొట్టిన జైస్వాల్, ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్ఆర్
ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.