India vs Australia: ఆసీస్తో జరిగే మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్లో భారత్ మార్పులు చేస్తుందా..?
- By Gopichand Published Date - 05:00 PM, Mon - 24 June 24
![India vs Australia: ఆసీస్తో జరిగే మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్లో భారత్ మార్పులు చేస్తుందా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/safeimagekit-1719141086833_INDvsAUS_Preview_11zon.jpg)
India vs Australia: T20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 పోరు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. సూపర్-8లో వెస్టిండీస్, అమెరికాలు నిష్క్రమించాయి. ఈరోజు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరిగే మ్యాచ్ తర్వాత మూడో జట్టు సెమీఫైనల్కు చేరుకునే పరిస్థితి తేలనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీస్కి టికెట్ దొరుకుతుంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే పరిస్థితులను బట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించవచ్చు.
ఆస్ట్రేలియాకు డూ ఆర్ డై మ్యాచ్
ఈ మ్యాచ్ భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ ముఖ్యం. సెమీఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాల్సిందే. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయి తర్వాతి మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే.. భారత్, ఆఫ్ఘనిస్థాన్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఒకవేళ ఇలా జరగకూడదటే ఈరోజు ఆసీస్ టీమిండియాను ఓడించాల్సి ఉంటుంది.
Also Read: T20 World Cup 2024: వెస్టిండీస్ కు షాక్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా
ఇరుజట్లలో ఎవరిది పైచేయి..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 31 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 19 మ్యాచ్లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 11 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 5 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 3 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లు విజయం సాధించాయి. ఈ గణంకాలను బట్టి చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది.
పిచ్ రిపోర్ట్
సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాట్స్మెన్కు సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 40 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 18 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఇక్కడ సగటు స్కోరు 145.
We’re now on WhatsApp : Click to Join
భారత్ మార్పులు చేస్తుందా?
గత 2 మ్యాచ్ల్లో భారత జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. దీన్ని బట్టి భారత జట్టు ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అదే ప్లేయింగ్-11తో భారత్ సూపర్-8 చివరి మ్యాచ్ను కూడా ఆడనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కనబరిచిన ప్రదర్శనతో జట్టులో ప్లేన్ ఖాయమైంది.
భారత్ జట్టు అంచనా
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Rohit Sharma: మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి షాకిచ్చిన రోహిత్ శర్మ..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/03/rohitg.jpg)
Rohit Sharma: మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి షాకిచ్చిన రోహిత్ శర్మ..!
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆఖరి మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 క్రికెట్లో ఛాంపియన్గా అవతరించేందుకు భారత జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత జట్టు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ జట్టు తరుపున అద్భుత ఇన్నింగ్స్లు ఆడుతున�