HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >When India Won The World Cup On April 2 2011

India Won ODI World Cup: టీమిండియా ప్రపంచకప్ గెలిచి పుష్కర కాలం.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ ఇప్పటికీ మరవలేం..!

క్రికెట్ ప్రేమికుడు ఈ రోజు (ఏప్రిల్ 2) ఎలా మర్చిపోగలడు. 28 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి భారత (India) జట్టు చరిత్ర సృష్టించిన రోజు ఇది. 12 ఏళ్ల క్రితం అంటే 2 ఏప్రిల్ 2011న ముంబైలో శ్రీలంకను ఓడించి భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో ఈ చరిత్ర సృష్టించబడింది.

  • By Gopichand Published Date - 01:57 PM, Sun - 2 April 23
  • daily-hunt
India
Resizeimagesize (1280 X 720)

క్రికెట్ ప్రేమికుడు ఈ రోజు (ఏప్రిల్ 2) ఎలా మర్చిపోగలడు. 28 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి భారత (India) జట్టు చరిత్ర సృష్టించిన రోజు ఇది. 12 ఏళ్ల క్రితం అంటే 2 ఏప్రిల్ 2011న ముంబైలో శ్రీలంకను ఓడించి భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో ఈ చరిత్ర సృష్టించబడింది. 28 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ కరువును తీరుస్తూ ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో ధోని సేన సృష్టించిన చరిత్రకు నేటికి పుష్కర కాలం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అదే ఆఖరి ప్రపంచకప్. కాబట్టి ఈ టైటిల్ కూడా అతనికి అమూల్యమైన బహుమతి. ఇక విరాట్ కోహ్లి.. సచిన్‌ని భుజాలపై కూర్చోబెట్టి మైదానం చుట్టూ తిరిగాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ మిగిలిన జట్టు ఆ టైటిల్ విజయంలో హీరోలు.

ఇంతకుముందు 1983లో టీమ్ ఇండియా ఒక్కసారి మాత్రమే ఈ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్. క్రికెట్ చరిత్రలో ఇది మూడో ప్రపంచకప్. అంతకు ముందు వెస్టిండీస్ మాత్రమే రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది. 1983 తర్వాత రెండోసారి 2011లో టీమిండియా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత జట్టు తన మూడో టైటిల్‌ కోసం వెతుకుతోంది. ఈ ఏడాదిలోనే దాన్ని పూర్తి చేయవచ్చు. వాస్తవానికి ఈ ఏడాది చివరలో అంటే అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌ ఆతిథ్యంలో వన్డే ప్రపంచకప్‌ ఆడాల్సి ఉంది. 2011లో కూడా భారత్‌లోనే ప్రపంచకప్‌ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మళ్లీ భారత్‌ నుంచి మూడో టైటిల్‌ గెలుపొందాలనే ఆశ అందరిలోనూ ఉంది.

On This Day in 2011 – India won ODI WC trophy, IND beat SL in final – One of the Greatest moment in Indian sports history.

"Dhoni finishes off in style, it's magnificent strike into crowd, India lift the World Cup after 28 years" – ICONIC, UNBELIEVABLE. pic.twitter.com/kwpto5NZQR

— Tanuj Singh (@ImTanujSingh) April 1, 2023

2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ గౌతం గంభీర్‌లతో కలిసి కెప్టెన్ ధోనీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఆ తర్వాత మహేల జయవర్ధనే 103 పరుగులతో అజేయ శతకం ఆడాడు. దీంతో ధీటుగా టీమిండియా 4 వికెట్లకు 277 పరుగులు చేసి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

గౌతమ్ గంభీర్ ఫైనల్లో టీమిండియా తరఫున అత్యధిక ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేశాడు. సెంచరీ మిస్సయ్యాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోని 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిచాడు. ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర బంతికి ఈ సిక్సర్ కొట్టాడు. గంభీర్‌తో కలిసి ధోనీ 109 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరలో యువరాజ్‌సింగ్‌తో కలిసి 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యువీ నాటౌట్‌గా 21 పరుగులు చేశాడు.

ఈ మొత్తం ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ కు మరవలేనిది. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. అతను టోర్నమెంట్ అంతటా బంతి, బ్యాటింగ్‌ను అదరగొట్టాడు. ప్రపంచకప్‌లో యువీ 362 పరుగులు చేయడంతోపాటు 15 ముఖ్యమైన వికెట్లు కూడా తీశాడు. సచిన్ టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా 482 పరుగులు చేసినప్పటికీ, జహీర్ ఖాన్ అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 Years For 2011 World Cup
  • ms dhoni
  • sachin
  • srilanka
  • TeamIndia

Related News

Indian Cricketers

Indian Cricketers: ఆన్‌లైన్ గేమింగ్ బిల్.. భారత క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ!

డ్రీమ్11, బీసీసీఐ మధ్య జూలై 2023లో ఒప్పందం కుదిరింది. దీనితో డ్రీమ్11 టీమ్ ఇండియా ప్రధాన జెర్సీ స్పాన్సర్‌గా మారింది. ఇది మూడేళ్ల ఒప్పందం. ఇది మార్చి 2026తో ముగియాల్సి ఉంది.

    Latest News

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd