LSG Owner: KL రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. వీడియో వైరల్..!
IPL 2024లో 57వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
- By Gopichand Published Date - 12:30 PM, Thu - 9 May 24
LSG Owner: IPL 2024లో 57వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో SRH 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. SRH కేవలం 9.4 ఓవర్లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో LSG యజమాని (LSG Owner) సంజీవ్ గోయెంకా.. LSG కెప్టెన్ KL రాహుల్ పై కోపంగా ఉన్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రజలు అనేక రకాల ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కెఎల్ రాహుల్తో మాట్లాడుతున్నట్లు చూడవచ్చు. సంభాషణ సమయంలో సంజీవ్ గోయెంకా ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో KL కూడా వారికి ఏదో వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ LSG యజమాని కోపం తగ్గడం లేదు. LSG యజమాని ఈ వైఖరి చాలా మంది అభిమానులకు నచ్చలేదు.
Also Read: PBKS vs RCB: నేడు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్..!
This is just pathetic from @LucknowIPL owner
Never saw SRH management with players on the field or even closer to dressing room irrespective of so many bad seasons and still face lot of wrath for getting involved. Just look at this @klrahul leave this shit next year #SRHvsLSG pic.twitter.com/6NlAvHMCjJ— SRI (@srikant5333) May 8, 2024
వైరల్ అవుతున్న వీడియోపై అభిమానులు ప్రశ్నలు
వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు అనేక ప్రశ్నలు సంధించారు. యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంజీవ్ గోయెంకా ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని రాహుల్ అభిమానులు అంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఏకాంతంగా చర్చించుకోవాలి. అదే సమయంలో మ్యాచ్ సెంటర్ లైవ్ సమయంలో ప్రెజెంటర్ కూడా మైదానంలో అలాంటి సంభాషణలు జరగకూడదని చెప్పడం కనిపిస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని చాలా కెమెరాలు రికార్డ్ చేస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి. దానికే ఇలా అయిపోతే ఎలా అని అభిమానులు సైతం ప్రశ్నలు కురిపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి యజమానులు ఉండటం మన ఆటగాళ్ల దురదృష్టం అని కొందరు రాసుకొచ్చారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
RR vs KKR: రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు.. సన్ రైజర్స్ దే సెకండ్ ప్లేస్
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ముగిసింది. చివరి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జరిపించేందుకు అంపైర్లు చివరి వరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో వర్షం తగ్గడంతో 7 ఓవర్ల మ్యాచ్ జరపాలని నిర్ణయించారు.