Virat Kohli: డేవిడ్ వార్నర్పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. చాలా డేంజరస్ అంటూ ప్రశంసలు..!
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ (David Warner)పై భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు.
- By Gopichand Published Date - 11:14 AM, Wed - 7 June 23

Virat Kohli: నేటి నుంచి లండన్లోని ఓవల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ (David Warner)పై భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. ICC పోస్ట్ చేసిన ఓ వీడియోలో విరాట్.. వార్నర్ను ఆస్ట్రేలియాకు “ప్రభావవంతమైన ఆటగాడు” అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని విరాట్ కోహ్లీ అన్నారు. ‘వార్షర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడాడు’ అని ప్రశంసించారు.
అతను అన్ని ఫార్మాట్లలో, టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా కోసం ఎల్లప్పుడూ ఆకట్టుకునే ఇన్నింగ్స్లు ఆడాడు. అతను ఆస్ట్రేలియా జట్టు కోసం కొన్ని గొప్ప ఇన్నింగ్స్లు ఆడాడు. ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాల్సిన అవసరం ఉందని కోహ్లీ అన్నాడు. 36 ఏళ్ల వార్నర్ 2019 యాషెస్ టూర్లో ఐదు టెస్టుల్లో 9.5 సగటుతో కేవలం 95 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో ఒక సెంచరీని నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో వార్నర్ ఆడినప్పటికీ అతను 14 మ్యాచ్ల్లో 516 పరుగులు చేశాడు. అతను సగటు 36.86. సీజన్లో 131.63 స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా నేడు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఐసీసీ టోర్నీలో 10 ఏళ్ల కరువుకు స్వస్తి పలకాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు చూపు కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్పైనే ఉంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 106 టెస్టు మ్యాచ్లు జరగ్గా అందులో ఆస్ట్రేలియాదే పైచేయి. కంగారూ జట్టు 106 మ్యాచ్లు ఆడగా 44 సార్లు గెలుపొందగా, భారత జట్టు 32 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన 29 టెస్టులు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ 1947లో జరిగింది.