Virat Kohli: బ్రేక్ టైమ్ ను ఆస్వాదిస్తున్న కోహ్లీ
విరాట్ కోహ్లి తనకు ఎంతో అవసరమైన బ్రేక్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజులుగా అసలు గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడుతున్న విరాట్కు సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
- By Naresh Kumar Published Date - 12:44 PM, Mon - 13 June 22
విరాట్ కోహ్లి తనకు ఎంతో అవసరమైన బ్రేక్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజులుగా అసలు గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడుతున్న విరాట్కు సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో ఫ్యామిలీతో గడుపుతున్న కోహ్లీ పూర్తి రిఫ్రెష్ తో మళ్లీ ఇంగ్లాండ్ టూర్ కు తిరిగి రానున్నాడు.
ఎక్కడికి వెళ్ళాడో తెలియక పోయినా సముద్రం పక్కన కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో బీచ్లో కూర్చున్న ఫొటోను విరాట్ పోస్ట్ చేశాడు. కేవలం షార్ట్స్ వేసుకొని ఇసుకలో కూర్చున్న విరాట్.. తన ఫామ్, క్రికెట్ తాలూకు ఆందోళనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్న ఫొటో ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. ఇది అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఆదివారం సాయంత్రం అతడీ ఫొటోను షేర్ చేయగా.. ఇప్పటికే మిలియన్ల కొద్దీ లైక్స్, వేల కామెంట్స్ వచ్చాయి. అసలు గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడి అలిసిపోయిన విరాట్కు ఇలాంటి బ్రేక్ చాలా అవసరమని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ వెకేషన్ తర్వాత విరాట్ మళ్లీ ఫ్రెష్గా క్రికెట్లోకి అడుగుపెడతాడని వాళ్లు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు దూరమైన విరాట్.. ఈ నెలాఖర్లో ఇంగ్లండ్ టూర్కు వెళ్లనున్నాడు.
🌊☀️ pic.twitter.com/VBVvlIIvLh
— Virat Kohli (@imVkohli) June 12, 2022
Related News
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.