Telangana : ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారుల హవా.. అద్భుత విజయాలు సాధించిన నిఖత్ జరీన్, అగసర నందిని
ఏషియన్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్ నిఖత్ జరీన్,హెప్టాథ్లాన్
- By Prasad Published Date - 11:22 PM, Sun - 1 October 23
ఏషియన్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్ నిఖత్ జరీన్,హెప్టాథ్లాన్ క్రీడా విభాగంలో గురుకుల విద్యార్థిని అగసర నందినిలు చెరో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ గురు కులాలు ఇప్పటికే విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో ఆసియా క్రీడల్లో సత్తా చాటడం గొప్ప విషయం అని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర క్రీడాకారులు తెలంగాణ తో పాటు దేశ ఖ్యాతి ని మరో మారు చాటారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డలు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించి తెలంగాణకే కాకుండా దేశానికే వన్నె తేవడం సంతోషంగా వుందని సీఎం కేసీఆర్ తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఆసియా క్రీడాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని అగసర నందిని హెప్టాథ్లాన్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి నందిని. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ (BBA) రెండో సంవత్సరం చదువుతున్నది. నర్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఐనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. సాధారణ పేద కుటుంబంలో నందిని జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయ్ అమ్ముతూ తన కూతురును గురుకుల పాఠశాల లో చేర్పించారు. నందిని విద్య లో రానిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచుకున్నది. హెప్టాథ్లాన్లో రానిస్తూ నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తూ అభినందనలు అందుకుంటోంది.
నిఖత్ జరీన్ 12 ఏళ్ల వయసులో నిజామాబాద్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచింది. మహిళల బాక్సింగ్ సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ చాంపియన్షిప్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా నిఖత్ జరీన్ ఘనత సాధించింది. నిజామాబాద్లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది.
Related News
IMD Red Alert : ఉత్తరాదికి రెడ్ అలర్ట్.. తెలంగాణకు రెయిన్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.