IPL 2024: బీసీసీఐకి ఒక్క ఐపీఎల్ సీజన్కు 500 కోట్లు
వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజన్కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
- By Praveen Aluthuru Published Date - 05:37 PM, Sat - 20 January 24
IPL 2024: వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ, టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజన్కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. మర్చి నెలాఖరులో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. టి20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడనున్నారు. మార్చిలో మొదలై రెండు నెలలపాటు సాగుతుంది. అనంతరం జూన్ మాసంలో టి20 ప్రపంచకప్ మొదలవుతుంది.
ఇండియాలో టాటా సంస్థకు మంచి రెప్యుటేషన్ ఉంది. దాంతో బీసీసీఐ టాటాతో డీల్ కు ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఇప్పుడు టాటా సంస్థ బీసీసీఐ కలిసి ఐపీఎల్ ను నిర్వహించనున్నాయి. విషయమేంటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఇటీవల టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ వేయగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి రూ.500 కోట్లు చెల్లించేలా మొత్తం ఐదేళ్లకు గానూ .2500 కోట్లతో టెండర్ వేసింది. అయితే టాటా సంస్థ ముందుకొచ్చి అదే మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైంది. దీంతో ఐపీఎల్ టైటిల్ హక్కులు టాటాకే దక్కాయి. ఈ నేపథ్యంలో 2028 వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతీ సీజన్కు బీసీసీఐకి.500 కోట్లు చెల్లించనుంది. ఇప్పటికే టాటా, బీసీసీఐ మధ్య బిజినెస్ అగ్రిమెంట్ జరిగింది.
టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్గా వైదొలగడంతో టాటాకు అవకాశం వచ్చింది. ఐపీఎల్కు ఏటేటా ప్రేక్షాకాదరణ పెరుగుతుండటంతో ఇటీవలి కాలంలో డిజిటల్ విధానంలో ఐపీఎల్ మ్యాచ్లు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.దీంతో డిజిటల్ ప్రసార హక్కుల కోసం ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. మ్యాచ్ సమయంలో మధ్య మధ్యలో వచ్చే చిన్నపాటి ప్రకటనల కోసం సదరు సంస్థలు పదిసెకన్లకు పది లక్షలకు పైగానే చెల్లిస్తున్నాయి.
Also Read: Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
Related News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.