Ind Vs SA 1st innings:సఫారీలను బెంబేలెత్తించిన అర్ష్ దీప్, చాహార్
టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు.
- By Naresh Kumar Published Date - 08:50 PM, Wed - 28 September 22
తిరువనంతపురం: టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 106 పరుగులకు పరిమితమయింది. ఒక దశలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎందుకంటే భారత్ బౌలర్లు ఓ రేంజ్ లో ఆ జట్టు బ్యాటింగ్ ను దెబ్బ తీశారు. అర్ష్ దీప్ , దీపక్ చాహర్ ధాటికి సౌతాఫ్రికా కేవలం 2.3 ఓవర్లలో 9 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ అయిదు వికెట్లలో నలుగురు డకౌట్ అయ్యారు.
తొలి ఓవర్ చివరి బంతికే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాను ఔట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్దీప్ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్ చేశాడు. అతని దెబ్బకు డికాక్ , రూసో , మిల్లర్ ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్.. స్టబ్స్ ను కూడా ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మక్రమ్ 25, పార్నెల్ 24 రన్స్ తో ఆదుకున్నారు. తర్వాత కేశవ్ మహారాజ్ 41 రన్స్ చేయడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 , దీపక్ చహార్ 2 , హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో భారత్ బుమ్ర , చాహల్ కు రెస్ట్ ఇచ్చింది. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
Pic Courtesy: BCCI/Twitter
Innings Break!#TeamIndia bowlers put on a show here in the 1st T20I as they restrict South Africa to a total of 106/8 on the board.
Scorecard – https://t.co/yQLIMooZxF #INDvSA @mastercardindia pic.twitter.com/v2K9K1iQ0C
— BCCI (@BCCI) September 28, 2022
Related News
IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.