SunRisers Hyderabad: ఫైనల్స్కు సన్రైజర్స్ హైదరాబాద్.. కోల్కతాకు ఆరెంజ్ అలర్ట్..!
: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
- By Gopichand Published Date - 11:24 PM, Fri - 24 May 24
SunRisers Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుచేసింది. మే 26వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో టైటిల్ కోసం పోటీపడనుంది.
Also Read: Bollywood Heroine: కండోమ్ బ్రాండ్ కు మద్దతు తెలిపిన పాపులర్ హీరోయిన్?
ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. బదులుగా రాజస్థాన్ పవర్ప్లేలో ఒక వికెట్కి 51 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత జట్టు తడబడింది. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ తరఫున షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ మైదానంలో మే 26న కోల్కతా, హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. అభిషేక్ శర్మ రూపంలో తొలి ఓవర్ లోనే జట్టు తొలి వికెట్ పడింది. 5 బంతుల్లో 12 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. దీని తర్వాత జట్టు కోలుకుంది. కానీ 5వ ఓవర్లో బాగా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి కూడా ఔటయ్యాడు. త్రిపాఠి 15 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతని తర్వాత ఐడెన్ మార్క్రామ్ వచ్చిన వెంటనే అవుటయ్యాడు. దీంతో జట్టులో కష్టాలు మొదలయ్యాయి. ట్రావిస్ హెడ్ 34, నితీష్ రెడ్డి 5, అబ్దుల్ సమద్ డకౌట్గా వెనుదిరిగారు.
We’re now on WhatsApp : Click to Join
తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతను 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 18వ ఓవర్ వరకు క్లాసెన్ జట్టును అదుపులో ఉంచాడు. జట్టు దాదాపు 200 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా సహకరించలేకపోయారు. దీంతో సన్రైజర్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. రాయల్స్ తరఫున ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు, సందీప్ శర్మ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్కు యశస్వి జైస్వాల్ శుభారంభం అందించాడు. అతను 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే మరొక ఎండ్లోని బ్యాట్స్మెన్ ఒక్కొక్కరుగా ఔట్ అయ్యారు. టామ్ కాడ్మోర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్ ఫ్లాప్ షో చూపించారు. అయితే రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ చివరి క్షణం వరకు పోరాడాడు. 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో రాజస్థాన్కు 36 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
Related News
T20 World Cup 2024: కీపర్ విషయంలో రోహిత్ శర్మ సందిగ్ధత
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు వికెట్కీపర్ ఎంపిక రోహిత్ శర్మకు,మరియు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ అద్భుతంగ రాణించారు.