ఎంఎస్ ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
CSK జట్టుకు కేవలం ధోనీ మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేని లోటు కూడా ఇబ్బంది పెడుతోంది. చెన్నై మిడిల్ ఆర్డర్లో ఆయన కీలక ఆటగాడు.
- Author : Gopi
Date : 11-04-2026 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో CSK అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. గాయం కారణంగా ధోనీ ఆటకు దూరమయ్యాడు. దీంతో ప్రతి మ్యాచ్తోనూ అభిమానుల నిరీక్షణ పెరుగుతోంది. ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే మ్యాచ్లో ధోనీ పునరాగమనం చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ధోనీ రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఒక చేదు వార్త అందింది. ధోనీ మైదానంలోకి అడుగుపెట్టడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీ ఎప్పుడు పునరాగమనం చేస్తాడు?
చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్ను నేడు (ఏప్రిల్ 11) చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ధోనీ అందుబాటులో లేడు. కాఫ్ స్ట్రెయిన్ (పిక్క కండరాల నొప్పి) కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఏప్రిల్ 14న KKRతో జరిగే కీలక మ్యాచ్లో ధోనీ ఆడతాడని ముందుగా భావించినప్పటికీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ధోనీ ఏప్రిల్ 18న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ధోనీ పూర్తిగా కోలుకోవడానికి మరో వారం సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
Also Read: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?
DCతో మ్యాచ్లో డెవాల్డ్ బ్రెవిస్ పునరాగమనం
CSK జట్టుకు కేవలం ధోనీ మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేని లోటు కూడా ఇబ్బంది పెడుతోంది. చెన్నై మిడిల్ ఆర్డర్లో ఆయన కీలక ఆటగాడు. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్రెవిస్ సైడ్ స్ట్రెయిన్ బారిన పడ్డాడు. దీనివల్ల ఆయన కూడా ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే అభిమానులకు ఒక శుభవార్త ఏమిటంటే.. ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో తాను ఆడుతున్నట్లు బ్రెవిస్ స్వయంగా ధృవీకరించాడు. ఆయన జట్టులోకి రావడం కచ్చితంగా CSK ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.