Sania Mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో సానియా మీర్జా..!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వచ్చే ఏడాది తొలి గ్రాండ్స్లామ్ ఆడనుంది. ఏడాదికాలం విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా మీర్జా (Sania Mirza) బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో ఆమె కజకిస్థాన్కు చెందిన అన్నా డానిలినాతో జోడీ కట్టనుంది.
- By Gopichand Published Date - 07:51 AM, Sat - 24 December 22
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వచ్చే ఏడాది తొలి గ్రాండ్స్లామ్ ఆడనుంది. ఏడాదికాలం విరామం తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా మీర్జా (Sania Mirza) బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో ఆమె కజకిస్థాన్కు చెందిన అన్నా డానిలినాతో జోడీ కట్టనుంది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో సానియా మీర్జా పాల్గొనడం ఇంకా ఖాయం కాలేదు. ప్రస్తుతం 24వ ర్యాంకులో ఉన్న సానియా, 11వ ర్యాంకర్ అయిన అన్నాతో కలిసి ఆడనుంది. WTA డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 24వ ర్యాంకర్ సానియా 2022 సీజన్ తర్వాత టెన్నిస్ ఆడటం మానేయాలని భావించింది. కానీ తర్వాత తన మనసు మార్చుకుంది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెన్నిస్ లీగ్లో సానియా ఆడుతోంది.
మహిళల డబుల్స్లో మాజీ ప్రపంచ నంబర్ 1 సానియా మీర్జా 2022లో డబ్ల్యూటీఏ 500 చార్లెస్టన్ ఓపెన్, డబ్ల్యూటీఏ 250 స్ట్రాస్బర్గ్ ఓపెన్లలో ఫైనల్స్కు చేరుకుంది. ఆమె రెండు ఫైనల్స్తో పాటు మరో ఆరు మహిళల డబుల్స్ సెమీ-ఫైనల్స్లో పాల్గొంది. ఈ ఏడాది సానియా సాధించిన విజయాల్లో ఒకటి వింబుల్డన్ 2022 మిక్స్డ్ డబుల్స్ సెమీ-ఫైనల్కు చేరడం. సానియా తన క్రొయేషియా భాగస్వామి మేట్ పావిక్తో కలిసి వింబుల్డన్ 2022 మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్కు చేరుకోవడం ఆ సంవత్సరానికి సాధించిన ఘనత.
Also Read: Jaydev Unadkat: అప్పుడు 11.5 కోట్లు.. ఇప్పుడు 50 లక్షలే
సానియా 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గింది. స్విట్జర్లాండ్ స్టార్ క్రీడాకారిణి మార్టినా హింగిస్తో కలిసి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్లో భారత స్టార్ లియాండర్ పేస్తో కలిసి సానియా 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో సానియా మీర్జా మహిళల డబుల్స్లో నదియా కిచెనోక్తో జతకట్టింది. మొదటి రౌండ్లోనే పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్లో అమెరికాకు చెందిన రాజీవ్రామ్తో కలిసి ఆమె క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
Related News
Mall : మాల్లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్ఫీల్డ్ మాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bo