Rohit Sharma: రో’హిట్’…సూపర్హిట్
టెస్ట్ మ్యాచ్లు, వన్డే.. టీ20 ఫార్మెట్ ఏదైనా హిట్ కొట్టడమే ఆయనకు తెలుసు. అందుకే ఆయనను హిట్ మ్యాన్గా.. అభిమానులు ముద్దుగా పిలుస్తారు.
- By Naresh Kumar Published Date - 10:30 PM, Sun - 7 August 22
టెస్ట్ మ్యాచ్లు, వన్డే.. టీ20 ఫార్మెట్ ఏదైనా హిట్ కొట్టడమే ఆయనకు తెలుసు. అందుకే ఆయనను హిట్ మ్యాన్గా.. అభిమానులు ముద్దుగా పిలుస్తారు. స్వదేశీ, విదేశీ ఏ గడ్డైనా ఓటమి ఎరుగని సారధి ఆయన.. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 8 సిరీస్ విజయాలను అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్గా రోహిత్శర్మ నిలిచాడు.
టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. తక్కువ కాలంలోనే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టాడు. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్తో కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో వరల్డ్కప్ రన్నరప్ కివీస్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేయడంతో అద్వితీయ విజయం అందుకున్నాడు.అప్పటి నుంచి కెప్టెన్గా రోహిత్ శర్మ విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. న్యూజిలాండ్ తర్వాత స్వదేశంలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్ను వన్డే, టీ20 సిరీస్లలో 3-0తో వైట్వాష్ చేసింది. అదే జోష్లో సొంతగడ్డపై.. శ్రీలంకకు చుక్కలు చూపించి టీ20 సిరీస్ను 3-0తో.. అదే విధంగా వన్డే సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన.. బట్లర్ బృందానికి సైతం చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 సిరీస్, వన్డే సిరీస్లను 2-1తో గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్కు ఝలక్ ఇచ్చింది.
ఇక తాజాగా వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ సేన 3-1తో కైవసం చేసుకుంది. ఇలా పరిమిత ఓవర్ల కెప్టెన్గా జైత్రయాత్ర కొనసాగిస్తూ హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత స్వదేశీ, విదేశీ గడ్డపై ఆడిన ఎనిమిదింటికి ఎనిమిది సిరీస్లు గెలిచి సత్తా చాటాడు. దీంతో హిట్మ్యాన్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. అపూర్వ.. అసాధారణ విజయాలు సాధించిన రోహిత్ శర్మ.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తోపు కెప్టెన్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇదే ఊపులో ఆసియా కప్, ప్రపంచకప్ గెలవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
Related News
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్కు భారత జట్టును ఎంపిక చేశారు.