Rishabh Pant: రిషబ్ పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) పునరావాసంలో ఉన్నాడు. కారు ప్రమాదం తర్వాత జరిగిన సర్జరీ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మధ్యమధ్యలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తన హెల్త్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.
- Author : Gopichand
Date : 26-03-2023 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) పునరావాసంలో ఉన్నాడు. కారు ప్రమాదం తర్వాత జరిగిన సర్జరీ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మధ్యమధ్యలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తన హెల్త్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. శనివారం కొంతమంది అతిథులు పంత్ ఇంటికి చేరుకుని అతనిని కలిసి, అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అతిథులు మరెవరో కాదు, భారత మాజీ క్రికెటర్లు.
సురేష్ రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్ శనివారం పంత్ను కలవడానికి అతని ఇంటికి చేరుకున్నారు. రైనా కూడా పంత్తో ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. ఒక మంచి సందేశాన్ని కూడా రాశాడు. చిత్రం శీర్షికలో రైనా ఇలా వ్రాశాడు.. సోదరత్వమే ప్రతిదీ. మన హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడ కుటుంబం ఉంటుంది. మా సోదరుడు రిషబ్ పంత్ చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నాడు.
Also Read: Royal Challengers Bangalore: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్.. ఆ ప్లేయర్ కు గాయం..!
అంతకుముందు, భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా పంత్ను కలవడానికి వెళ్ళాడు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫిట్నెస్ ప్రక్రియలో ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ త్వరలో తిరిగి వచ్చి మళ్లీ మెరుస్తాడని యువరాజ్ చెప్పాడు. ప్రమాదం కారణంగా పంత్ ఈ ఏడాది ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా నియమితులయ్యారు.
గతేడాది డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీ సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ముంబైకి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఇంట్లోనే ఉన్నాడు. ఇటీవల పంత్ స్విమ్మింగ్ పూల్లో నడుస్తున్నట్లు కనిపించే ఒక వీడియోను పంచుకున్నాడు. త్వరలో అతను కోలుకునే సూచనను అభిమానులకు ఇచ్చాడు.