HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rishabh Pant Fined Rs 12 Lakh For Slow Over Rate

DC VS CSK: స్లో ఓవర్ రేట్‌ కారణంగా రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు.

  • Author : Praveen Aluthuru Date : 01-04-2024 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dc Vs Csk
Dc Vs Csk

DC VS CSK:  ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు. ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ఢిల్లీకి తొలి విజయం కాగా, రెండు మ్యాచ్ లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది.

చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించింది. దీని కారణంగా పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా పడిన రిషబ్ పంత్ ప్రస్తుత ఐపీఎల్‌లో రెండో కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. అయితే జట్టు చేసిన తొలి నేరం కావడంతో పంత్, గిల్‌లకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇదే తప్పు పునరావృతమైతే కెప్టెన్లకు రూ.24 లక్షల జరిమానా విధిస్తారు. ఇది కాకుండా జట్టులోని ఇతర సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడుతుంది. మూడోసారి తప్పు చేస్తే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇతర జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల అభిమానుల ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్ కి దిగిన చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ ఫోర్ల , సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. ధోనీ 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో అలరించాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు మరియు మూడు సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు.

Also Read: KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DC vs CSK
  • fine
  • ipl 2024
  • Rishabh Pant
  • RS 12 lakh
  • Shubman Gill
  • slow over rate
  • vishakapatnam

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd