Richa Ghosh: మా అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా: రిచా ఘోష్
మహిళల ఐపీఎల్ వేలంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిచా ఘోష్ (Richa Ghosh)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల రిచా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో భాగంగా ఉంది.
- By Gopichand Published Date - 02:00 PM, Tue - 14 February 23
మహిళల ఐపీఎల్ వేలంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిచా ఘోష్ (Richa Ghosh)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల రిచా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో భాగంగా ఉంది. ఐపీఎల్ వేలంలో కోట్లకు అమ్ముడుపోయిన ఆమె ఇప్పుడు తన తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనాలని కలలు కన్నది. రిచా తన తల్లిదండ్రుల కోసం కోల్కతాలో ఇల్లు కొనాలనుకుంటోంది.
రిచా మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నేను భారత్కు ఆడాలని కోరుకున్నారు. నా జట్టుకు సారథ్యం వహించి భారత్కు పెద్ద ట్రోఫీని అందించాలనుకుంటున్నాను. కోల్కతాలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నా తలిదండ్రులు వారి జీవితాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్న జీవితంలో చాలా కష్టపడ్డాడు. నా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కూడా మా నాన్న అంపైరింగ్ చేస్తున్నారు. వేలం తర్వాత వారు అంత కష్టపడాల్సిన అవసరం లేదని నేను ఆశిస్తున్నాను అని ఆమె పేర్కొంది.
Also Read: Most Polluted City In India: ఇండియాలో అత్యంత కలుషిత నగరం ఏదో తెలుసా..?
రిచా తండ్రి మనబేంద్ర ఘోష్ మహిళల ఐపిఎల్ వేలానికి ముందు మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్ దేశంలో మహిళల క్రికెట్ను బాగా మెరుగుపరుస్తుంది. రాబోయే క్రికెటర్లందరికీ ఆర్థికంగా కూడా సహాయపడుతుంది. రిచాపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అంచనాలు లేవు. ఇది మంచిదానికి నాంది. రాష్ట్ర స్థాయి క్రీడాకారులు కూడా పెద్ద స్థాయిలో ఆడవచ్చు. వారికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. WPL ఆడుతున్న ఆటగాళ్లను చూసి, చాలా మంది యువతులు క్రికెట్ ఆడాలనే స్పూర్తి, నిశ్చయానికి లోనవుతారని ఆయన అన్నారు.
రిచా 2020లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున మొత్తం 17 వన్డేలు, 31 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. వన్డేల్లో 22.21 సగటుతో 311 పరుగులు చేసింది. ఇందులో ఆమె 2 అర్ధ సెంచరీలు సాధించింది. అదే సమయంలో T20 ఇంటర్నేషనల్లో ఆమె 24.10 సగటుతో 135.50 స్ట్రైక్ రేట్తో 458 పరుగులు చేసింది.
Related News
West Bengal Governor: గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన ఆనంద బోస్
: పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజకీయాలకు ప్రతిగా విపక్షాలను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.