Ravindra Jadeja: టెస్టులకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా రిటైర్మెంట్?
అతని ఈ పోస్ట్ను చూసిన అభిమానులు జడేజా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడని ఊహాగానాలు మొదలుపెట్టారు.
- By Gopichand Published Date - 02:18 PM, Sat - 11 January 25

Ravindra Jadeja: బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కని పరిస్థితి నెలకొంది. ఇందులో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకు పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జడేజా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో అతను టెస్ట్ జెర్సీ వెనుక ఉన్న నెంబర్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. చొక్కాపై ‘8’ అని రాసి ఉంది.
అతని ఈ పోస్ట్ను చూసిన అభిమానులు జడేజా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడని ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే జరిగితే కంగారూ జట్టుతో ఆడిన సిడ్నీ టెస్టు అతని కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్గా మారుతుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జడేజా టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ షరతుల నుంచి మినహాయింపు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జడేజా మూడు మ్యాచ్లు ఆడాడు
36 ఏళ్ల జడేజా ప్రదర్శన కొంతకాలంగా ప్రశ్నార్థకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ జడేజా ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది. జడేజా ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిరాశపరిచాడు. ఈ సిరీస్లో అతను ఐదు మ్యాచ్లలో మూడు మాత్రమే ఆడే అవకాశం పొందాడు. ఒక బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. మార్పు అవసరమని సెలెక్టర్లు ఎప్పుడు నిర్ణయిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. జడేజా సేఫ్ ఆప్షన్తో వెళ్లాలా లేక ఇప్పుడే వేరే వారితో ముందుకు వెళ్లాలా అనే అంశంపై చర్చించనున్నారు. జడేజా బౌలింగ్ నిలకడగా ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన చేయడంలో అతను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు.
Ravindra Jadeja's Instagram story. 🌟🇮🇳 pic.twitter.com/vacB7do0HB
— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అతని విషయంలో బీసీసీఐ థింక్ ట్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోగా, 2017లో ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.