Shreyas Iyer: కేకేఆర్ జట్టుకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న అయ్యర్..!
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు.
- Author : Gopichand
Date : 28-02-2024 - 7:29 IST
Published By : Hashtagu Telugu Desk
Shreyas Iyer: ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు గాయాల సమస్యతో సతమతమవుతున్నారు. ఈ కారణంగానే వచ్చే ఐపీఎల్ సీజన్లో చాలా మంది ఆటగాళ్లు ఆడటంపైపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సిరీస్లో వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. అయ్యర్ రంజీ ట్రోఫీ 2024 సెమీ-ఫైనల్లో పునరాగమనం చేయబోతున్నాడని తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2024 సెమీ-ఫైనల్ కోసం ముంబై జట్టును విడుదల చేయగా సెమీ ఫైనల్స్కు ముందు జట్టుకు అంతర్జాతీయ ఆటగాడి చేరికపై శుభవార్త అందింది. అదే సమయంలో IPL ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కూడా అయ్యర్ తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకుంది.
ప్రస్తుత రంజీ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే.. ముంబై జట్టు క్వార్టర్స్లో బరోడాతో డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఫలితం లేకపోయినప్పటికీ 41 సార్లు రంజీ ఛాంపియన్ ముంబై చివరి నాలుగులోకి ప్రవేశించింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంతో ఆ జట్టు సెమీఫైనల్కు టికెట్ దక్కించుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగిన భారత జట్టులోని చివరి మూడు టెస్టుల నుండి తొలగించబడిన శ్రేయాస్ అయ్యర్ని చేర్చుకున్న జట్టు సెమీ-ఫైనల్ జట్టు వెల్లడించింది.
Also Read: Kishan Reddy: దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి : కిషన్ రెడ్డి
అయ్యర్ ఫిట్
గాయం సమస్య కారణంగా ముంబై తరఫున శ్రేయాస్ అయ్యర్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆడలేకపోయాడు. స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా గాయం కారణంగా జట్టు తరఫున ఈ మ్యాచ్ ఆడలేకపోయాడు. అయ్యర్ జట్టులోకి వచ్చాడు కానీ దూబే తిరిగి రాలేదు. శివమ్ దూబే సైడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడుతున్నారు. PTI సమాచారం ప్రకారం.. అయ్యర్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. అతను సెమీ ఫైనల్ మ్యాచ్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
We’re now on WhatsApp : Click to Join
అంతర్జాతీయ ఆటగాళ్ల కలయిక
ఈ ముంబై జట్టులో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. అజింక్యా రహానే (కెప్టెన్), పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, ధవల్ కులకర్ణి వంటి ఆటగాళ్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులోకి వచ్చాడు. ముంబై తరఫున క్వార్టర్ఫైనల్స్లో 10, 11వ ర్యాంక్ ఆటగాళ్లు తనుష్ కొటియన్, తుషార్ దేశ్పాండేలు అద్భుత సెంచరీ ఇన్నింగ్స్లు ఆడి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆ జట్టు 42వ రంజీ టైటిల్ కోసం ఫైనల్కు చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.