Rajasthan Royals: రాజస్థాన్, బెంగుళూరు తుది జట్లు ఇవే
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరుగనుంది.
- By Naresh Kumar Published Date - 12:16 PM, Tue - 5 April 22
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని తెలుస్తుంది. తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచినా రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో మ్యాచు లో కూడా అదే జోరు కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే రెండో మ్యాచ్ లో కేకేఆర్ పై విజయం సాధించిన ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించాలని యోచిస్తోంది.
ఇక ఈ మ్యాచ్ లో ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. ఫాఫ్ డు ప్లెసిస్ , అనుజ్ రావత్
ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ లోయర్ ఆర్డర్ లో డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికొస్తే.. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..
అలాగే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కెప్టెన్సీ లోని రాజస్థాన్ రాయల్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్,, మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ , షిమ్రాన్ హెట్మెయర్ లోయర్ ఆర్డర్ లో రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.అలాగే ఈ మ్యాచ్ జరగనున్నముంబైలోని వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్నికొస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Related News
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్కు ఉండే క్రేజ్ను సాధించింది.