Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో భారతీయ అథ్లెట్ల ప్రత్యేక రికార్డులివే..!
ఈ ఒలింపిక్స్లో భారత్కు ఆశించిన స్థాయిలో పతకం రాకపోయినప్పటికీ.. భారత అథ్లెట్లు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు.
- By Gopichand Published Date - 08:48 AM, Sun - 11 August 24

Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) నేటితో ముగియనుంది. ఈ ఒలింపిక్స్లో భారత్ మొత్తం 6 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో భారత్ ఒక్క స్వర్ణం కూడా గెలవలేకపోయింది. అయితే ఈ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేశారు. భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించగా, నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో పతకం సాధించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఇదే సమయంలో మను భాకర్ షూటింగ్ పోటీలో అద్భుత ప్రదర్శన, ఒకే ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్లో భారత్కు ఆశించిన స్థాయిలో పతకం రాకపోయినప్పటికీ.. భారత అథ్లెట్లు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు. ఈ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సాధించిన రికార్డులు ఏమిటో ఈ నివేదికలో తెలుసుకుందాం.
Also Read: Hindenburg Research : హిండెన్బర్గ్ నివేదిక అవాస్తవం.. అదానీ గ్రూపుతో సంబంధం లేదు : సెబీ ఛైర్పర్సన్
ఈ రికార్డులు సృష్టించారు
- రెజ్లింగ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ 21 ఏళ్ల 24 రోజుల వయసులో ఒలింపిక్స్లో పతకం సాధించి భారత్కు ఒలింపిక్ పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
- ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచాడు.
- 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ తర్వాత భారత పురుషుల హాకీ జట్టు తొలిసారిగా వరుసగా రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకుంది.
- షట్లర్ లక్ష్య సేన్ ఒలింపిక్ గేమ్స్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్లో సెమీ-ఫైనల్కు చేరుకున్న తొలి పురుష ఆటగాడిగా నిలిచాడు.
- ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను భాకర్ రికార్డు సృష్టించింది.
- మను భాకర్-సరబ్జోత్ సింగ్ జంట ఒలింపిక్స్లో భారత్కు తొలిసారి షూటింగ్ టీమ్ ఈవెంట్ పతకాన్ని అందించింది.
- మను భాకర్ స్వతంత్ర భారతదేశం నుండి ఒకే ఎడిషన్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొదటి అథ్లెట్గా నిలిచింది.
- ఒలంపిక్స్లో సింగిల్స్ ఈవెంట్లో ప్రిక్వార్టర్ఫైనల్కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక బాత్రా నిలిచింది.
- ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ నాలుగో స్థానంలో నిలిచారు. ఏ ఒలింపిక్స్లోనైనా మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితం.
- షూటింగ్ ఈవెంట్లో భారతదేశం మొదటిసారిగా 3 పతకాలు గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు షూటింగ్లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన.
We’re now on WhatsApp. Click to Join.