Mumbai Indians: ముంబై ఇండియన్స్కు మరో షాక్.. కీలక ఆటగాడికి గాయం..?
లంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.
- By Gopichand Published Date - 12:36 PM, Sun - 17 March 24
Mumbai Indians: శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను ఐపీఎల్ 2024లో ఆడడంపై సందేహం నెలకొంది. గాయం కారణంగా మధుశంక పునరావాసంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ అతనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. అయితే మధుశంకకు సంబంధించి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ నుంచి కానీ, ఐపీఎల్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.
బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లోని రెండో మ్యాచ్లో మధుశంక గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ పూర్తయ్యేలోపు మధుశంక మైదానం వీడాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ అతనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. గాయం కారణంగా దిల్షాన్ మధుశంక భవిష్యత్ మ్యాచ్లలో ఆడలేడని శ్రీలంక క్రికెట్ ట్విట్టర్లో రాసింది. అతను పునరావాసంలో ఉన్నాడని పేర్కొంది.
Also Read: RCB- DC In Final: నేడు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ పోరు.. టైటిల్ గెలిచెదెవరో..?
మధుశంక గాయం ముంబై ఇండియన్స్కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అతను ఫామ్లో ఉన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. 4.60 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కాగా మధుశంక బేస్ ధర రూ.50 లక్షలు. ఇది అతని తొలి IPL సీజన్. అయితే ఇప్పుడు మధుశంక ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధుశంకకు సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా ముంబై ఇండియన్స్ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు.
🚨 Team Updates 🚨
Dilshan Madushanka will not further take part in the ongoing tour as the bowler will return to start rehabilitation work after suffering an injury during the 2nd ODI.
Madushanka, who left the field during the second ODI while bowling, has suffered a left… pic.twitter.com/O3RvhR7oHa
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 17, 2024
మధుశంక అంతర్జాతీయ కెరీర్ను పరిశీలిస్తే అద్భుతంగా ఉంది. 14 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. ఈ సమయంలో 24 పరుగులకు 3 వికెట్లు తీయడం ఒక మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన. మధుశంక 23 వన్డేల్లో 41 వికెట్లు పడగొట్టాడు.
We’re now on WhatsApp : Click to Join
Related News
CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది.