IPL Band Value: బ్రాండ్ వాల్యూలో ఐపీఎల్ సరికొత్త రికార్డ్… మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఏదో తెలుసా ?
- By Praveen Aluthuru Published Date - 10:20 PM, Mon - 10 July 23
IPL Band Value: ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆటగాళ్ళ నుండి స్పాన్సర్ల వరకూ… బీసీసీఐ నుండి ఫ్రాంచైజీల వరకూ కాసుల వర్షం కురిపించే లీగ్.. ఈ లీగ్ లో ఆడేందుకు ఆటగాళ్ళు , భాగమయ్యేందుకు కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార దిగ్గజాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. లీగ్ ఆరంభమై 15 ఏళ్ళు గడిచినా క్రేజ్ ప్రతీ సీజన్ కూ పెరుగుతూనే పోతోంది. తాజాగా ఐపీఎల్ వాల్యూ అత్యుత్తమ స్థాయికి చేరింది. ప్రపంచ క్రీడారంగంలో అత్యధిక బ్రాండ్ వాల్యూకు సంబంధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ( ఎన్ఎఫ్ఎల్) అగ్రస్థానంలో ఉండగా..ఐపీఎల్ దాని తర్వాతి స్థానంలో ఉంది. ఎన్ఎఫ్ఎల్ లో ఒక మ్యాచ్ కు మీడియా రైట్స్ ద్వారా 35.1 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుండగా.. ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ కూడా 14.1 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ లో మోస్ట్ వాల్యూబుల్ టీమ్ గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ ఏడాది సీజన్ ఛాంపియన్ గా నిలిచి ఐదో టైటిల్ కైవసం చేసుకున్న ధోనీసేన బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. 2023 సీజన్ తర్వాత ఓ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం చెన్నై బ్రాండ్ వాల్యూ 212 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 సీజన్ లో 146 మిలియన్ డాలర్లుగా ఉంటే… ఇప్పుడు 66 మిలియన్ డాలర్లుగా ఉంది. అటు ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ, పలువురు స్టార్ ప్లేయర్స్ తోనూ చెన్నైకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీ ఆ జట్టు క్రేజ్ కు ప్రధాన కారణం. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ 200 మిలియన్ డాలర్లు దాటి ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా… తొలి సీజన్ తోనే ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో ఉంది.
Read More: Nurse : పేషంట్తో సెక్స్ చేసి అతని మరణానికి కారణమైన నర్స్.. హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా?
Related News
KKR vs MI: పరువు కోసం బరిలోకి దిగుతున్న ముంబై.. నేడు కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్..!
ఇప్పుడు IPL 2024లో ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి.